Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: కాంగ్రెస్ లో చెరకుంటే కేసులా

కాంగ్రెస్ లో చేరాలంటూ బీఆర్ఎస్ నాయ కులను కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, పార్టీలో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపుల కు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు.

ఎవరూ అధైర్యపడవద్దంటున్న కేటిఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ లో చేరాలంటూ బీఆర్ఎస్(BRS)నాయ కులను కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారని, పార్టీలో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపుల కు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. ఎవరూ అధైర్యపడ వద్దని, అందరికీ అండగా ఉంటాన ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బల మైన ప్రతిపక్షంగా ఉన్నామని, ప్రజ ల పక్షాన ప్రజల సమస్యలే ఎజెం డాగా కొట్లాడుదామని పిలుపు నిచ్చారు.

సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల మునిసిపల్ బీఆర్ఎస్ క్లస్టర్ స్థా సమావేశం (Parliament elections) ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహం పై సమావేశం నిర్వహించారు.లోక్ సభవ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ స్ తో లబ్ధి పొందిన కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారని ఆరోపిం చారు. అబద్ధపు హామీలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెసపై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు.

రైతు బంధు(Rythu bandhu) అందించలేదని, రుణమాఫీ చేయలేదని, రైతులను మరోసారి మోసం చేయడానికి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపరని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో( Lok sabha elections)బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మే 10న సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షో ఉంటుందని ప్రతీ కార్యకర్త తరలివచ్చి రోడ్ షోను విజయవం తం చేయాలని కేటీఆర్ పిలుపుని చ్చారు.

Congress cases on BRS leaders