Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lok sabha elections: బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు

ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిం చుకునేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాల ని రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు.

ఇండియా కూటమికి అధికారం అవశ్యం
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు కాంగ్రెస్ కు అవకాశం
30 లక్షల ఉద్యోగాల భర్తీకి సమాయత్తం
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార ప్రారం భ సభలో మంత్రి ఉత్తమ్‌

ప్రజా దీవెన, కోదాడ: ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని(democracy) పరిరక్షిం చుకునేందుకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాల ని రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని హెచ్చ రించారు. సూర్యాపేట జిల్లా కోదాడ లో గురువారం నిర్వహించిన నల్ల గొండ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ప్రజాస్వామ్యా న్ని కాపాడుకునేందుకు బీజేపీని ఓడించాలని ఓటర్లకు పిలుపుని చ్చారు. మతతత్వ పార్టీ బీజేపీని ఓడించేందుకు సీపీఐ, సీపీఎం మద్దతు తెలపడం అభినందనీ యమన్నారు. అహంకార బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, పార్లమెంట్‌ ఎన్ని కల(parliament elections) అనంతరం ఆ పార్టీ కనుమ రుగు అవుతుందని తెలిపారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో జరిగిన అభివృ ద్ధి మైక్రోస్కోప్‌ పెట్టి చూసినా కనప డదని ఆరోపించారు. పదేళ్లకు ముందు ఖాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌, ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌, రంగా రెడ్డి జిల్లాల్లో రెండున్నర లక్షల కోట్లతో ఐటీ పరిశ్రమలు నెలకొల్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదో చెప్పాలని నిలదీశారు. 2022లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన బీజేపీ రెట్టింపు చేయక పోగా, తగ్గేందుకు కారణం కాలేదా, అని ప్రశ్నించారు. రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే కనీస మద్దతు ధర ఇస్తామని, మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేటికీ అమలు చేయలేదని విమర్శించారు.

దేశంలో 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని ఎందుకు భర్తీ చేయడంలేదని అడి గారు. ఇండియా కూటమి అధి కారంలోకి రాగానే 30లక్షల ఉద్యో గాలను భర్తీ చేస్తామని ప్రకటిం చారు. బీజేపీ న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకువస్తుందని, ఈడీ కేసులు పెడుతూ విపక్ష సీఎంలను తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకుం టోందని ఆరోపించారు. మతతత్వం తో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు నడుంబిగించాలని కోరారు.

నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌(congress) తరఫున పోటీ చేస్తోన్న కుందూరు రఘువీర్‌ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ సభలో కుందూరు రఘువీర్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయ వీర్ రెడ్డి, ఎర్నేని బాబు, మహబూ బ్ జాని, బుర్ర పుల్లారెడ్డి, అల్తాప్ హుస్సేన్, చింతకుంట్ల లక్ష్మీ నారా యణరెడ్డి, పార సీతయ్య, వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల నా యకులు తదితరులు పాల్గొన్నారు.

Congress party win in Lok sabha elections