Congress Ruling: పక్కాగా పదేళ్ళు అధికారంలో కాంగ్రెస్
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కోరుకుం టున్న విధంగా ఎన్నికల తర్వాత కానే కాదు వచ్చే పదేళ్లు పక్కాగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుం దని మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలవి ప్రాపగండ ప్రచారాలు
ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీ లు పోటీయే కాదు
మునుగోడు కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ప్రజా దీవెన, మునుగోడు: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కోరుకుం టున్న విధంగా ఎన్నికల తర్వాత కానే కాదు వచ్చే పదేళ్లు పక్కాగా అధికారంలో కాంగ్రెస్(congress) పార్టీ ఉంటుం దని మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోతుందని ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బిజెపి నేతలు చేస్తున్న ప్రచారాలు ప్రాపగoడాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో(Lok sabha elections) కాంగ్రెస్ కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీనే కాదన్నారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కాదు,భారీ మె జార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధు లు కలిసి సమన్వయంతో పని చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధిక మెజార్టీ తీసుకురావాలన్న దానిపై పోటీ పడుతు న్నామని, ఏ నియో జకవర్గం నుంచి అధిక మెజార్టీ వస్తే ప్రభుత్వం నుంచి రూ.100కోట్లు నిధులు అభివృద్ధి కోసం అదనంగా కేటాయించనున్నట్లు చేసిన ప్రతిపా దనకు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల ఆయన అభినందించారు.
గతంలో కేసీఆర్ నియంతగా సాగించిన కుటుంబ పాలనలో చేసిన పాపాలు ఒక్కొక్క టిగా బయటపడుతున్నాయన్నా రు. ఇప్పటికే కేసీఆర్ కూతురు లిక్క ర్ కేసులో జైలుకు వెళ్లిందని, ఆయ నతో పాటు కొడుకు, అల్లుడుతో పాటు పలువురు ముఖ్యనేతలు సైతం జైలుకు వెళటం ఖాయమ న్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అయిందని, ఇక కేసీఆర్ దుకా ణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిష్యుడిగా ముద్రపడిన చామలను అత్యధిక మెజారిటీ తో గెలిపించా లనే ప్రధాన లక్ష్యంతో తనకు ఇన్చా ర్జి బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు.
తనకు కుట్రలు కుతంత్రాల రాజకీయాలు లేవని, ముక్కుసూ టిగా మాట్లాడుతానన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణకుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి మునుగోడు గడ్డపై ఏర్పాటు చేసిన ఒకే వేదికలో ఉండటం చూస్తుంటే పండుగ వాతావరణం స్పష్టంగా కనబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలో పనిచేసే కార్యకర్త లకు మాత్రమే గుర్తింపు ఉంటుంద న్నారు. ఏఐసీసీ నాయకుడు రోహి త్ చౌదరి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ లు పదేళ్ల పాలనలో ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్, భువనగిరి, తుంగతుర్తి, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనీల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, మల్ రెడ్డి రంగారెడ్డి లు కూడా మాట్లాడి భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు అయినందున ప్రజా సేవలో నిరంతరం శ్రమించే అవకాశం ఉందని ప్రజలు ఇదంతా గమనించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. బీఆర్ఎస్, బీజే పీలు మిత్రులేనని, రాత్రిపూట దోస్తానం, పగటి పూట శత్రుత్వంలా ఉంటారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్నేత, రాపోలు జయప్రకాష్, భవానీ రెడ్డి, బాల లక్ష్మీ, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నారబోయిన రవి ముది రాజ్, భూడిద లింగయ్య యాదవ్, తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు అచ్చిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
Congress ruling up to ten years