Revanth Reddy : ఆమాత్రమొచ్చినా అధికారం మాదే
లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండి యా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయబోతోందని కాంగ్రెసకు 125 సీట్లు వచ్చినా కూటమి భాగస్వా మ్యపక్షాల మద్దతతో కేంద్రంలో పాగా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు 125వచ్చినా మిత్రుల తో కలిసి కేంద్రంలో పాగా వేస్తాం
బిజెపి పార్టీకి నమ్మకమైన మిత్రు లు కరువయ్యారు
ఆర్ఎస్ఎస్ అజెండానే బీజేపీ లక్ష్యం రిజర్వేషన్ల తొలగింపు
రాజ్యాంగం రద్దు కోసమే 400కు మించి నినాదం ఎత్తుకొంది
ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల(Lok sabha elections) తర్వాత కేంద్రంలో ఇండి యా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయబోతోందని కాంగ్రెసకు 125 సీట్లు వచ్చినా కూటమి భాగస్వా మ్యపక్షాల మద్దతతో కేంద్రంలో పాగా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావా ల్సి ఉంటుందని,బీజేపీ సొంతంగా ఫిగర్ (మెజారిటీ) దాటలేకపోతే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకు నేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరని, కాంగ్రెస్ పరిస్థి తి వేరని, మాకు మద్దతు పలికేం దుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఓ ప్రైవేటు వెబ్ సైట్ ముఖాముఖి లో మాట్లాడారు. బీజేపీ 400కు మించి సీట్ల నినాదంపై స్పందిస్తూ రిజర్వేష న్లను తొలగించాలని, రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతోనే ఈ నినాదా న్ని ఎత్తుకుందని సీఎం ఆరోపిం చారు.
బీజేపీకి ఆర్ఎసఎస్(BJP and BRS) తల్లి లాంటిదని, తల్లి చెప్పిన మాటలు పిల్లలు పాటిస్తారని గుర్తు చేశారు. ఇంటర్వ్యూ ఆసాంతం ఆయన మాటల్లోనే…ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్-370 రద్దు, సీఏఏ, ఎన్నార్సీ వంటివన్నీ ఆర్ఎసఎస్ లక్ష్యాలు. వాటిని బీజేపీ నెరవేర్చింది. వీటి తర్వాత రిజర్వేషన్ల తొలగింపును, రాజ్యాంగం రద్దును ఆర్ఎసఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని నెరవే ర్చాలంటే లోక్ సభ లో మూడింట రెండు వంతుల సీట్లు అవసరం. అందుకే బీజేపీ 400కి పైగా అనే నినాదాన్ని తీసుకొచ్చింది’ అని రేవంత్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావటం దేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదమ న్నారు.
తన విద్యార్థి జీవితం ఆర్ ఎసఎస్ అనుబంధ విద్యార్థి సం ఘం ఏబీవీపీతోనే ప్రారంభమైం దని, వాళ్ల సిలబస్ ఏమిటో తనకు బాగా తెలుసని చెప్పారు. పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదన్న వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, అది జరిగిం దనడానికి ఎలాంటి ఆధా రాలు లేవన్నారు. పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిం చారు. నిఘా వర్గాల వైఫల్యంతోనే ఈ దారుణ ఘటన జరిగిందని, భారత్-పాకిస్థాన్(India and pakistan boarder) సరిహద్దుల్లో ఉండాల్సిన నిఘావర్గాల అధికారు లను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అంతం చేసేందుకు మోహరించటం వల్లనే పుల్వామా ఘటన జరిగిందని విమర్శించారు.
నాకు శత్రువులు ఉన్నారు, రాజకీ య ప్రత్యర్థులూ ఉన్నారు. శత్రువు లు ఎవరుండాలని ఎంపిక చేసుకో వడం నా చేతుల్లో లేదు. పోరాడు తూ ముందుకెళ్లడమే నా పని’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నికార్సైన, చాలా తెలివైన వ్యక్తి అని రేవంత్ పేర్కొన్నారు. రాహుల్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా అదానీ, అంబానీల గురించి ఆయన ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అదానీని తాను ఆహ్వానించడం తప్పేమీకాదని చెబుతూ.. ‘అదానీ మా రాష్ట్రం నుంచి ఏమీ తీసుకెళ్లడం లేదు. నేనే ఆయన పెట్టుబడులు తీసుకుంటున్నా. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావటం కోసమే అదానీని, అయన కుమారుడిని సచివాలయంలో కలిశాను. అందులో తప్పేముందని వారు భారత పౌరులే కదా అని సీఎం పేర్కొన్నారు.
ప్రధాని మోదీని బడే భాయ్అనడాన్ని సమర్థించు కుంటూ దేశంలోని ప్రతీ ముఖ్య మంత్రి దేశ ప్రధానిని పెద్దన్నలాగే భావిస్తారని, ప్రధానమంత్రి సైతం కుటుంబ పెద్దగా రాష్ట్రాలకు సహకారం అందించాల్సి ఉంటుం దన్నారు. రాష్ట్రంలో బీర్ఎసతో, జాతీయస్థాయిలో బీజేపీతో, మోదీతో తమకు ప్రధానంగా పోటీ ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పా రు. పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమీక్షా సమావేశం రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమి టీ సమీక్షించింది. గురువారం గాంధీ భవన్లో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మునీతో(AICC in-charge Deepadas Munshi)పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ఉ పాధ్య క్షుడు వినోదొడ్డి, మాజీ మంత్రి పుష్పలీల, ఇతర సభ్యులతో పాటు ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఆయా నియో జకవర్గాల్లో పోలింగ్ సరళి, పార్టీ అభ్యర్థుల పని తీరు, విజయావకా శాలపై సమావేశంలో చర్చించారు.
Congress ruling with 125 seats