Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

sri bala ugra laxmi narasihma swamy: స్వామివారి కల్యాణానికి హాజరు కావాలని మంత్రి ఉత్తమ్ కి ఆహ్వానం

మండల పరిధిలోని ఎర్రవరంలో కొలువుదీరిన దూళ్లగుట్ట శ్రీబాల ఉగ్రలక్ష్మీ నరసింహా స్వామి కల్యాణ మహోత్సవ వేడుకలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హాజరుకావాలని కోరుతు ఆలయ కమిటీ అధ్యక్షులు నలజాల జగన్నాథం ఆదేశాల మేరకు కమిటీ నిర్వాహకులు శనివారం మంత్రి కి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ప్రజా దీవెన, కోదాడ: మండల పరిధిలోని ఎర్రవరంలో కొలువుదీరిన దూళ్లగుట్ట శ్రీబాల ఉగ్రలక్ష్మీ నరసింహా స్వామి(sri bala ugra laxmi narasihma swamy) కల్యాణ మహోత్సవ వేడుకలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(uttam kumar reddy), ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి హాజరుకావాలని కోరుతు ఆలయ కమిటీ అధ్యక్షులు నలజాల జగన్నాథం ఆదేశాల మేరకు కమిటీ నిర్వాహకులు శనివారం మంత్రి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 21 నుండి 23 వరకు కల్యాణ వేడుకలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రికి తెలిపారు. కల్యాణ వేడుకలను హాజరవుతానని మంత్రి తెలిపారన్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు భాషబోయిన భాస్కర్రావు, ఎర్రవరంపీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, షేక్. లతీఫ్, వేమూరు మధు, వీరేపల్లి నాగేంద్రప్రసాద్. బెల్లంకొండ ఉపేందర్, రావుల వెంకటేశ్వర్లు, వల్లెపు సుదర్శన్. వెంకటేశ్వర్లు ఉన్నారు.

Dullagutta Sribala Ugralakshmi Narasimha Swamy