First under river metro rail pm Modi : అండర్ రివర్ మెట్రో ఎక్కడో తెలుసా
--కోల్కతా ఈస్ట్-వెస్ట్ మధ్య 10.8 కి.మీ. మేర భూగర్భంలోనే --నేడు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ
మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో ఎక్కడో తెలుసా
–కోల్కతా ఈస్ట్-వెస్ట్ మధ్య 10.8 కి.మీ. మేర భూగర్భంలోనే
–నేడు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గ ర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. రాను న్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ( mo di) దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూ పాయల తో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు, ప్రారంభో త్సవాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమ, మంగళ వారం రెండు రోజులు తెలంగాణ ( Telangana) లో పర్యటించిన ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయ లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లు చేశారు.
అదేవిధంగా నేడు కోల్కతాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రూ.15,400 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేయనున్నా రు. ముఖ్యంగా దేశంలోనే మొట్ట మొ దటిసారిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మిం చిన నీటి అడుగున నడిచే మెట్రో రైలును (under river metro rail) ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన దాదాపు రూ. 120 కోట్ల వ్యయం తో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు.
కోల్ కతా ఈస్ట్-వెస్ట్ మ ధ్య 16.6 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించగా ఇందులో 10.8 కి.మీ. భూగర్భం లోనే ఉంది. హావ్డా మై దాన్ నుంచి ఎస్ప్లె నెడ్ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ. మేర ఉన్న లైన్ లో భాగంగా 520 మీటర్ల పొడవు గల అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ని ర్మించారు. నది లోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకన్ల లోనే పూర్తి చేస్తుంది. ఈ సొరంగాన్ని నదీ గర్భానికి 16 మీటర్ల లోతులో, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో నిర్మించారు. ఈ సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లుగా బాహ్య వ్యాసం 6.1 మీటర్లుగా ఉంది.
హావ్డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లడానికి ప్రస్తుతం 90 ని మిషాల సమయం పడుతోంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పా టుతో ఈ ప్ర యాణ సమయం 40 నిమిషాలకు తగ్గ నుంది. ఈ అం డర్ వాటర్ మెట్రో రైలు నడిచే మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉండ గా అందు లో మూడు భూగర్భంలోనే ఉన్నాయి. ఈ అండర్ వాటర్ మెట్రో రైలు ప్రయాణ దూరాన్ని తగ్గించడంతో పాటు కోల్కతా వాసు లకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.
దీంతో పాటు, కోల్కతా లోని మరిన్ని మెట్రో మార్గాలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంబించ నున్నారు.హౌరా మైదాన్ – ఎస్ల్పానేడ్ మెట్రో మార్గం, కవి సుభాస్ – హమంత ముఖోపాధ్యాయ మెట్రో మార్గం, తరటాలా – మజెర్హట్ మెట్రో మార్గం, రూబీ హాల్ క్లినిక్ – రాంవాడి మెట్రో మార్గం వంటి తదితర మెట్రో లైన్ లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.