Health destination Telangana minister : ఆరోగ్య బ్రాండ్ రాష్ట్రంగా తెలంగాణ
--జాతీయ స్థాయిలో నిమ్స్ కు బ్రాండ్ ఇమేజ్ --నిమ్స్ అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తాం --నిమ్స్ ఆస్పత్రి లో కొత్తగా 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్ లు, పాటు 300 మంది స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలు అందజేత --నిమ్స్ లో అత్యాధునిక సిపిఆర్, స్కిల్ ల్యాబ్ ల ప్రారంభోత్సవం లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ
ఆరోగ్య బ్రాండ్ రాష్ట్రంగా తెలంగాణ
–జాతీయ స్థాయిలో నిమ్స్ కు బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తాం
–నిమ్స్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేస్తాం
–నిమ్స్ ఆస్పత్రి లో కొత్తగా 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్ లు, పాటు 300 మంది స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలు అందజేత
–నిమ్స్ లో అత్యాధునిక సిపిఆర్, స్కిల్ ల్యాబ్ ల ప్రారంభోత్సవం లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ
ప్రజా దీవెన/హైదరాబాద్: రాష్ట్రం లో ఉస్మానియా, గాంధీ, కాకతీ య, ఆసుపత్రిలో తో పాటు నిమ్స్ ఆస్పత్రి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ అరోగ్య రాష్ట్రంగా ప్రపంచoలోనే ఎంతో గుర్తింపు ను రావడానికి కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మెడికల్ టూరి జంతో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కు కృషి చేస్తున్నా మన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రి లో నూతనంగా రూ. 12 కోట్లతో నిర్మించిన DSA Lab, 5 కోట్ల రూపాయలతో నిర్మించిన స్కిల్ ల్యాబ్ లో CPR అడ్వాన్సుడ్ హై – ఫైడ్లిటీ టెక్ ఎనేబుల్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ లాబ్ (Advanced high – fidelity tech enabled Critical care simulation skill lab) లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చోoగ్తు, జెన్నిఫర్ లార్సన్ – US కౌన్సిల్ జనరల్ హైదరాబాద్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా CPR (Cardiopul monary Resuscitatio n) ను మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో NIMS కు బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. NIMS బ్రాండ్ కొనసాగేలా తనవం తు సహకారం అందిస్తున్నామన్నారు. వచ్చే 20 ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు.
నిమ్స్ ఆస్పత్రి పర్యటన లో మంత్రి దామోదర్ నరసింహ ఆసుపత్రి లోని అన్ని ప్రధాన విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమ్స్ ఆస్పత్రి విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు. విస్తరణ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా నిమ్స్ డైరెక్టర్ తో చర్చించారు. అనం తరం నిమ్స్ ఆస్పత్రి లో 39 అసోసియేట్ ప్రొఫెసర్ లను, 300 మం ది స్టాప్ నర్సుల నియామకాల పత్రాలను అందజేశారు.
నిమ్స్ హాస్ప టల్లో నూతనంగా 12 కోట్ల రూపాయలతో నిర్మించిన DSA Lab ను, USAID సంస్థ సహకా రంతో 5 కోట్ల రూపాయల తో అడ్వాన్సు డ్ హై ఫిడిలిటీ టెక్ ఎనేబుల్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ లాబ్ ను దక్షిణ భారతదేశం లోనే తొలిసారిగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభిం చినందుకు మంత్రి అభినందించారు. క్రిటికల్ కేర్ సిమ్యు లేషన్ స్కిల్ ల్యాబ్ లో మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా CPR ను పరి శీలించారు.
ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరిం టెండెంట్ డా. నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభా గదిపతి సాయి సతీష్, USAID డా . వరప్రసాద్, నిఖిల్ రెడ్డి, NI MS ఆస్పత్రి వివిధ విభాగాధిపతులు, డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది పాల్గొ న్నారు.