Inhumaneincidents: ప్రజా దీవెన హైదరాబాద్: దేశంలో అమానవీయ సంఘటనలు రోజు రోజుకు మితిమీరిపో తున్నాయి. మానవ సంబంధాలు మానవ విలువలకు తిలోదకాలు చెప్పుకోవ డానికి వీలు లేని విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు.ఈ కోవలోనే కర్ణా టకలో అమానుష ఘటన చోటు చేసుకుంది. హెచ్ఐవీ (HIV ) సోకిన 23 ఏళ్ల యువకుడిని తన సొంత అక్కాబావ గొంతును లిమి చం పే సిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. తన తమ్ముడికి ఎయిడ్స్ ఉందని ఊళ్లో వాళ్లకు తెలిస్తే కుటుంబం పరు వుపోతుందని భావించిన ఆ యువకుడిని భార్యాభర్త కలిసి చంపే శారు. కర్ణా టకలో తాజాగా పరువు హత్య జరగడం ప్రస్తుతం పెను సంచలనం సృష్టించింది.
ఎయిడ్స్ సోకిన వారి పట్ల సమాజం మాత్రమే కాదు, సొంత కుటుం బం తీరు కూడా ఎంత వివక్షపూరితంగా ఉంటుందో కళ్లకు కట్టిన అమానుష ఘటన ఇది.ఈ ఘటనకు సంబం ధించిన పూర్తి వివరా ల్లోకి వెళితే.. కర్ణాటక చిత్రదుర్గ జిల్లా హోళల్ కెరె తాలూకాలోని దు. మ్మి అనే గ్రామం లో మల్లిఖార్జున్ అనే యువకుడు ఉన్నాడు. బెంగ ళూరులోని గార్మెం ట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసే మల్లిఖా ర్జున్ అప్పుడ ప్పుడు సొంతూరు వచ్చి వెళుతుండేవాడు. మల్లిఖార్జు న్ కు నిషా అనే అక్క ఉంది. నిషా ఒక యువకుడిని కులాంతర వివాహం చే సుకుంది. మల్లిఖార్జున్ కు పెళ్లికాలేదు. గతంలో మాదిరిగానే జులై 23న మల్లిఖార్జున్ సొంతూ రికి తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో వ స్తుండగా ఆ కారుకు ప్రమాదం జరిగింది. ఆ కారు లారీని ఢీ కొట్ట డంతో మల్లిఖార్జున్ కు తీవ్రగాయాలయ్యాయి.
అతని స్నేహితులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయ పడిన మల్లిఖార్జున్ అతని స్నేహితులను చిత్రదుర్గ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి అ తని అక్కాబావ, తల్లి దండ్రులు హా స్పిటల్కు వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం మల్లిఖార్జు న్ ను దావణగెరె లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తస్రా వం ఎక్కువ కావ డంతో సర్జరీ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. సర్జరీకి ముందు మల్లిఖార్జున్కు రెగ్యులర్ ట్రీట్మెంట్ లో భాగంగా బ్ల డ్ టెస్ట్ చేయగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ విషయం మ ల్లిఖార్జున్ అక్కాబావకు వైద్యులు చెప్పారు.
ఈ విషయం మిగిలిన వాళ్లెవరికీ తె లియదు. కాలుకు తీవ్ర గాయ మై అ తనికి కంట్రోల్ చేయలేని విధంగా బ్లీడింగ్ అవుతుందని ఇ క్కడ సర్జరీ కష్టమని బెంగళూరుకు తరలించారని డాక్టర్లు చెప్పారు. దీంతో మల్లిఖా ర్జున్ తల్లిదండ్రులు అతని అక్కాబావను అంబులె న్స్లో వెళ్లాలని చెప్పారు. హెచ్ఐవీ విషయం తెలిసిన మల్లిఖార్జున్ అక్కాబావ ఈ వి షయం బయట తెలిస్తే కుటుంబం పరువు పో తుందని భావించారు. బెంగళూరుకు అతనిని అంబులెన్స్ లో తర లించే క్రమంలో మల్లిఖార్జున్ గొంతు నులిమి చంపేశారు. బెంగ ళూ రు తీసుకెళుతుంటే దారి మధ్య లో తీవ్ర గాయాల కారణంగా బ్లీడిం గ్ అయి చనిపోయాడని మల్లిఖార్జున్ తల్లిదండ్రులతో పాటు ఊ రందరినీ నమ్మించారు.
బెంగళూరు నుంచి సొంతూరికి మల్లిఖార్జున్ డెడ్ బాడీ తో చేరు కున్నారు. అంత్యక్రియల స మ యంలో మల్లిఖార్జున్ గొంతు దగ్గ ర నులిమినట్టుగా మచ్చలు కనిపిం చడంతో కుటుంబ సభ్యులకు అ నుమానమొచ్చింది. మల్లిఖార్జున్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అ తని అ క్కాబావను విచారించగా అసలు వి షయం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం పరువు హత్య మాత్రమే కా దని, కులాంతర వివాహం చేసుకు న్నందు వల్ల మల్లిఖార్జున్ అక్కాబావ ఆ కుటుం బం ఆస్తిపై కన్నేసి అతని అడ్డు తొలగించుకున్నారని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.