Intigrated residensials international schools : ఇంటర్నేషనల్స్ కు దీటుగా ఇoటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్
--రూ.2500 కోట్లతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం --పైలేట్ ప్రాజెక్టుగా ఎంపికైన మధిర నియోజకవర్గం --నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలేడ్జ్ కేంద్రాలకు శ్రీకారం --విద్యాశాఖ ఉన్నత అధికారుల సమీక్షలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క
ఇంటర్నేషనల్స్ కు దీటుగా ఇoటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్
–రూ.2500 కోట్లతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం
–పైలేట్ ప్రాజెక్టుగా ఎంపికైన మధిర నియోజకవర్గం
–నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలేడ్జ్ కేంద్రాలకు శ్రీకారం
–విద్యాశాఖ ఉన్నత అధికారుల సమీక్షలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క
ప్రజా దీవెన/ హైదరాబాద్: ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టా లని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (mallu ba tti vikramaarka) విద్యా శాఖ అధికారులను అదేశించారు. గురువారం డా. బి.ఆర్ అంబే ద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యా శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరం లో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బిసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం ( Construction of 100 SC, BC, Minority Residential School Buil dings across the State) చేపడుతున్నట్టు వివరించారు. ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసిందన్నారు.
భవన నిర్మాణాలకు గాను బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడ జరిగి నందున భవన నిర్మాణాల పనులు త్వరితగతిన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు ఒక చోట ఉండే విధంగా యాక్షన్ప్లాన్ (action plan) ఉండాలన్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవ నాలు ఇంటిగ్రేటేడ్ గా ఒకే చోట నిర్మాణం చేయడం వల్ల స్థల సమ స్య ను అధిగమించొచ్చని సూచించారు.
అదే విధంగా కామన్గా అందేటి సౌకర్యాల వల్ల కూడ కొంత అదన పు ప్రయోజనం కల్గుతుందన్నారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థు లు ఒకే చోట ఉండటం వల్ల విద్యార్థుల్లో సోదర భావాన్ని పెంపొందిం చడం వల్ల కుల రహిత సమాజానికి బాటలు వేసిన వారమవుతామ న్నారు. అలాగే మిని ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ది చేయడానికి బా గుంటుందని వివరించారు.
ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం మధి ర నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా (poilat project) ఎంపిక చేశామన్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ను చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు.ఎస్సీ, బిసి, మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఎర్రుపాలెం మండల పరిధిలో నిర్మాణం చేయడానికి స్థల ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం జరుగడానికి కావాల్సిన స్థల ఎంపిక ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం త్వరగా జరుగడానికి వివిధ శాఖల అధికారుల తో సమ న్వయం చేసుకోవాలని ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అ బ్ధుల్ నదీం ను ఆదేశించారు.
అనంతరం బెంగళూర్కు చెందిన ఆర్కిటెక్ ప్రతినిధులు దేశంలో వి విధ ప్రాంతాల్లో వారు చేపట్టిన ఇంటర్ నేషనల్ మోడల్ పాఠశాల లకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజేటేంషన్ను విద్యాశాఖ అధి కారుల సమక్ష్యంలో డిప్యూటి సీఎం తిలకించారు. అన్ని హంగులతో అత్యుత్తమ ప్రమాణాలతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు ఒకే మోడల్ గా చేపట్టాడానికి తగిన చర్యలు తీసుకోవా లని అధికారులను అదేశించారు.
నియోజకవర్గాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు…ప్రభుత్వ ఉద్యో గాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చే యనున్నట్టు డిప్యూటి సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టీ ఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రక టించునున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఆర్ధిక వెసలుబాటు కల్పించడానికి ఈకేంద్రా లను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
జ్యోతి భా పూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలేడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఈ లక్ష్యం సఫలికృతం కావాడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను అదేశించారు.