- బ్రేకింగ్ న్యూస్..
ఇమ్రాన్ ఖాన్ కు జైలు శిక్ష
ప్రజా దీవెన /హైదరాబాద్: దాయాది పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ పాకిస్తాన్ లోని ఓ కోర్టు శనివారం తీర్పు ఇవ్వడం సంచలనం కలిగించింది. ఇమ్రాన్ పై నమోదైన తోషాఖానా కేసును విచారించిన కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఖరీదైన ప్రభుత్వ బహుమతులను విక్రయించి వ్యక్తిగతంగా లబ్ధి పొందారనే అభియోగాలు నమోదు కాగా దీన్నే తోషాఖానా కేసు అని అంటారు. ఇందులో ఇమ్రాన్ ను దోషిగా తేల్చిన కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.