Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jesus Christ is the proof of sacrifice: త్యాగానికి నిదర్శనం ఏసు క్రీస్తు

--నల్లగొండ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

త్యాగానికి నిదర్శనం ఏసు క్రీస్తు

–నల్లగొండ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజాదీవెన/నల్లగొండ: త్యాగం, మానవత్వం కలబోతే ఏసుక్రీస్తు అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో నిజం కోసం, ప్రజలకోసం ప్రాణా లు ఇవ్వడానికి కూడా సిద్ధ పడ్డ త్యాగ మూర్తి యేసు క్రీస్తు అని ( Jesus Christ is the sacrificial figure who is ready to give his life for the truth in the world and for the people) అయన అన్నారు. నల్గొండ పట్టణంలోని సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, క్లాక్ టవర్ సెంటర్లో గల బాప్టిస్ట్ చర్చి, సీబీసీ చర్చ్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి ఆయన క్రిస్మస్ ప్రార్ధనలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 30ఏండ్లుగా నగరంలోని చర్చిలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినందున సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉంచుతామని ( Sonia Gandhi said that the state of Telangana will be kept on the path of development in all fields) ఆయన అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు పథకాన్ని అమలుపరచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పనులను పరిశీలించారు. రూ. 6.25 కోట్లతో నిర్మితమవు తు న్న గెస్ట్ హౌస్ ను విఐపి గెస్ట్ హౌస్ గా తీర్చిదిద్దాలని ( Rs. 6.25 Crore guest house to be built as a VIP guest house)  ఇంజనీర్లను ఆదేశించారు. ఎంట్రెన్స్ గేట్ పెద్దగా ఉండాలా చూడాలని ఆయన ఆదేశించారు. గెస్ట్ హౌస్ నిర్మాణం ఎనిమిది నెలలో పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అంతకుముందు జిల్లా ఇంచార్జి కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్ పాటిల్, ఎస్పీ అపూర్వ రావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కా ర్యక్రమంలో చర్చి స్పీకర్ పండు ప్రేమ్ కుమార్, పాస్టర్ సతీష్ చంద్ర దాస్, ప్రెసిడెంట్ సి.ఎస్ క్రిస్టఫర్, చర్చ్ ప్రతినిధులు అప్షాలుమ్, కృ పానందం, ఆనంద్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నల్ల గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పి టిసి వంగూరి లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, YMCA ప్రెసిడెంట్ విలియమ్స్, సీఎస్ఎస్టీబీసీ ప్రెసిడెంట్ క్రిష్టాఫర్, పలు వార్డుల కౌన్సిలర్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.