Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Power sector: విద్యుత్ రంగంపై ఆయనవన్నీ అవాస్తవాలు

పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయిందని, నాటి పాలకుల అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టి వేయబడిందని డిప్యూటీ సీఎం, విద్యుత్తు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.

కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
విద్యుత్ రంగంపై చర్చకు సిద్ధమన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో, తాజా బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటనలకు దీటుగా స్పందించిన డిప్యూటీ సీఎం

ప్రజా దీవెన, హైదరాబాద్: పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం(Power sector) కోలుకోలేని నష్టాలకు గురి అయిందని, నాటి పాలకుల అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టి వేయబడిందని డిప్యూటీ సీఎం, విద్యుత్తు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అవరోధా లు అన్నిటిని అధిగమించి రెప్పపా టు కూడా కరెంటు పోకుండా చర్య లు తీసుకుంటున్నామని, రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సు లతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పార్ల మెంటు ఎన్నికల ముందు బీఆర్ ఎస్(BRS) అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలు వాస్తవాలపై చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన సారాంశం వివరాలు.. దీర్ఘకాలిక అవ సరాల కోసం చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి విద్యుత్తు కొనుగోలు చేశామని మాజీ సీఎం కేసీఆర్(KCR) మాటల్లో వాస్తవం లేదు.6 మే 2017 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కు డిసెంబర్ 2014లో ఒప్పందం చేసుకున్నారు. కానీ తెలంగాణ డిస్కమ్ లకు 300 నుంచి 400 మెగా ఓట్ల కన్నా ఎక్కువ సరఫరా చేయలేదు.

పైగా ఏప్రిల్ 2022 నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా ఆపేశారు. చత్తీస్గడ్ రాష్ట్రంతో చేసు కున్న ఒప్పందాన్ని అమలు చేయిం చడంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మేము యూ నిట్ కు రూ. 13 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్టు కాంగ్రెస్ నాయ కులు ప్రచారం చేస్తున్నారు. మేము కొనుగోలు చేసింది యూనిట్ కు రూ 3.90 మాత్రమే అని కేసీఆర్ అంటు న్నారు. నాటి పాలకులు విద్యుత్ యూనిట్కు రూ. 20 చొప్పున చె ల్లించి కొనుగోలు చేశారు. వాస్తవ మా, కాదా ఇది రికార్డుల్లో నమోదు చేయబడి ఉంది. చర్చకు నేను సిద్ధం అని డిప్యూటీ సీఎం ప్రతి సవాల్ విసిరారు. ఎన్ టి పి సి ఒక్కో యూనిట్ 15 రూపాయలు చొప్పున చెల్లిస్తే విద్యుత్ సరఫరా చేస్తానని అన్నది. అందుకు మేము ఒప్పుకోలేదని మాజీ సీఎం ప్రకటిం చడం వాస్తవ దూరం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం(Andhra Pradesh Reorganization Act) 2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ టి పి సి యూనిట్ కు రూ.5.60 చొప్పున సగటున ధర నిర్ణయించి 1600 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ డిస్కమ్ లకు సరఫరా చేసింది.

తాజా కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కు 13 రూపాయల కన్నా ఎక్కువే చెల్లించి కొనుగోలు చేస్తుం దని బిఆర్ఎస్ అధ్యక్షుడు ఆరోపిం చారు. డిసెంబర్ 2023 నుంచి తెలంగాణ డిస్కమ్స్ కొనుగోలు చేసిన విద్యుత్తు ఒక్కో యూనిట్ సగటు ధర 5.34 మాత్రమే. మేము యూనిట్ కు 13 రూపాయలు చొ ప్పున చెల్లించి కొనుగోలు చేశామ నేది పచ్చి అబద్ధం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 77 00 మెగావాట్ల విద్యుత్తు అందు బాటులో ఉండేది. ప్రస్తుతం 19 ,000మెగావాట్ల విద్యుత్ ఉంది. అయినా కెసిఆర్ పక్కకు పోగానే కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇది రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన. పూర్తి అవాస్తవా లతో కూడిన ప్రకటన అని డిప్యూటీ సీఎం తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో స్థాపిత థర్మల్ విద్యు త్తు సామర్థ్యం (Thermal power efficiency) 2080 మెగావాట్లు మాత్రమే. ఇందులో 1000 మెగా వాట్లు ఛత్తీస్గడ్ నుంచి సేకరించారు. ఇది ఏప్రిల్ 20 22 లోనే విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. మిగిలిన 10 80 మెగావాట్ల ధర్మల్ కెపాసిటీ ని భద్రాద్రి (Btps) లో సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి అధిక వ్యయంతో నిర్మించారు. రాష్ట్రం లోని మిగిలిన అన్ని థర్మల్ మరి యు హైడల్ ప్రాజెక్టులు గత ప్రభు త్వాలచే 2014 కి ముందే ప్రారం భించారు. డిసెంబర్ 20 23 నుంచి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనం త అత్యధిక విద్యుత్ సరఫరాను చేసింది.

తెలంగాణ డిస్కములు రాష్ట్రంలో అత్యధికంగా 15, 623 మెగా వాట్లు మరియు 308.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ను సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా రికార్డ్ స్థాయిలో 4093 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను తట్టుకొని నిలబడ్డాయి. డిసెంబర్ 23 నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించి న సందర్భమే లేదు. గత పది ఏళ్ల లో నాసిరకం నాణ్యతలేని లైన్లు ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇతర ఆస్తుల నిర్వహణ సాంకేతికలో పాల కారణంగా తీవ్ర అంత రాయా లకు దారి తీసింది. వాటన్నిటిని మేము గాడిలో పెట్టే పనిలో ఉన్నా ము. హైదరాబాదును పవర్ ఐలాం డ్ గా మార్చామని మాజీ సీఎం ప్రకటించడం వాస్తవ దూరమైనది. 20 12 లో గ్రిడ్ కుప్పకూలిన తర్వా త హైదరాబాద్ పవర్ ఐలాండ్ పథ కం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకు ముందే కాంగ్రెస్ హ యాం లోనే హైదరాబాద్ పవర్ ఐలాండ్ గా రూపు దిద్దుకుంది. దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి.

మేము అధికారంలోకి వచ్చిన మూ డు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాము. విద్యుత్కు ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫ లమైందని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరోపించడం దొంగ దొంగ అన్నట్టు ఉంది. గత ప్రభుత్వ పాపాల మూలంగా తెలంగాణ డిస్కంలు వేలకోట్లలో అప్పుల్లో కూరుకుపో యాయి. 2 జూన్ 2014 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కం ల నష్టాలు రూ. 12, 186 కోట్లు కాగా మీ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి 31-3-2023 నాటికి ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిం ది. ఈ అంకెలు ఈరోజు నమోదు చేసినవి కావు.వాస్తవాలు చెరిపేస్తే చెరిగేవి కావు. విద్యురంగంపై చర్చ కు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు.

K Chandra shekhar rao lies on Power sector