Komatireddy venkatreddy: కూలిపోతున్న కేసిఆర్ ప్రాజెక్టులు
--నిర్మాణంలో ఉన్నవి ఉన్నట్లే పగుళ్లు పడుతున్నాయి --యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ --నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుడిగాలి పర్యటన --ఒకేరోజు రూ.134.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కూలిపోతున్న కేసిఆర్ ప్రాజెక్టులు
–నిర్మాణంలో ఉన్నవి ఉన్నట్లే పగుళ్లు పడుతున్నాయి
–యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
–నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి సుడిగాలి పర్యటన
–ఒకేరోజు రూ.134.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన
రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: కేసిఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు నిర్మాణం కాకముందే కూలిపోతున్నాయని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యతకన్నా కమీషన్లపైనే దృష్టిపెట్టిందని అందువల్లే ఒక్క ప్రాజెక్టు కూడా నాణ్యంగా లేదని, ప్రజాధనాన్ని వృధా చేసిన ఆ పార్టీ నాయకులు ఇవ్వాల మాకు నీతులు చెప్పడం ఏమిటని ఆయన మండిపడ్డారు.
శనివారం నల్లగొండ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన ఒకేరోజు రూ.134.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసిన
సాగర్ లో నీరు లేకపోవడం,శ్రీశైలం సోరంగ మార్గం ద్వారానే నీటి కోసం రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు 1500 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టినట్లు,పనులు అసం పూర్తిగా ఉన్నయాని,మూడు సంవత్సరం ల్లో సొరంగ మార్గం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని తెలిపారు.
ఏ.యం. అర్.పి.ద్వారా త్రాగు నీరు రెండు రోజులు అవు తుందని, మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు రూ. 510 కోట్లతో,రూ. 310 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ ల పనులు నెలలోపు టెండర్ పిలిచి పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ముషంపల్లిలో రూ. 99.80 కోట్ల నిధులతో నల్గొండ, ముషంపల్లి, ధర్మాపురం,కన్నేకల్, తిప్పర్తి రోడ్డు వెడల్పు, పటిష్ట పరచు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ముషంపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
పాఠశాలలో ఇప్పటికీ కనీసం స్వచ్ఛమైన తాగునీరు అందించని ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుమీద వేలకోట్లు దోపిడి చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషంపల్లి పాఠశాల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రికి పాఠశాలలో పిల్లలకు, టీచర్లకు త్రాగునీటి గురించి స్థానికులు విన్నవించగా తక్షణమే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కిన్లీ కంపెనీ వారితో సమన్వయం చేసుకొని హైకెపాసిటీ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
అదే విధంగా రెండు అదనపు క్లాస్ రూం లు,5 లక్షల రూ లతో అంగన్ వాడి భవనం నిర్మాణం మంజూరు కు మంత్రి ప్రకటించారు.వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామం లో మిగిలిన సి.సి.రోడ్లకు 20 లక్షలు మంజూరు చేశారు. సైడ్ డ్రైన్ తో పాటు ఎస్.సి.కాలనీ,బి.సి.కాలనీ లో సి.సి.రోడ్లు సి.సి.రోడ్లు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.
రాజకీయాలు శాశ్వతం కాదని నాయకునిగా మనం చేసిన మంచి పనులే మనల్ని పదికాలాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడుతాయని వ్యాఖ్యానించారు. నల్లగొండ పట్టణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఇది ఒక భవనం కాదని ఎందరో నిరుద్యోగ యువతీ యువకుల జీవితాల్లో, కుటుంబాల్లో వెలుగులు నింపే దీపమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
అందరు నాయకుల్లాగా తాను ప్రారంభోత్సవాలు చేసి చేతులు దులుపుకునే రకం కాదని, ప్రారంభించిన ప్రతీ పనిని పూర్తి చేసేవరకు పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తియిన తర్వాత స్కిల్ సెంటర్లో నా నల్గొండ బిడ్డలకు కోర్సు ముగిసిన రెండు నుంచి మూడు నెలల్లో ఉపాధి దొరికేలా సిబ్బందితో పనిచేయిస్తానని మంత్రి తెలిపారు. ఇది తన కలల ప్రాజెక్టు అని, నన్ను గుండెల్లో పెట్టుకున్న నల్గొండ యువత రుణం తీర్చుకోవడానికి నాకు దొరికిన అవకాశమని మంత్రి అన్నారు.
యువత కూడా చెడు వ్యసనాలకు, దురలువాట్లకు లోనుకాకుండా స్కిల్ సెంటర్ లో చేరి మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నా అని, ఉద్యోగాలు రాలేదని డిప్రెషన్ లోకి వెళ్లకుండా స్కిల్ సెంటర్లో చేరి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన యువతకు సూచించారు. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని కొద్ది రోజులు ఎక్కువ మంది నన్ను కలవడానికి రావడం వల్ల అందరిని కలవలేకపోతున్నా, అయ్యో మంత్రిని కలుద్దమను కుంటే కలవలేకపోయామని నారాజు కావద్దు మీ అందరి గుండె చప్పుడు నాకు తెలుసు, మీ ఇంట్లో మనిషిగా మీ అందరి సమస్యలను తీర్చుతానని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటానని, చెప్పిన ప్రతీ పనిని పూర్తి చేస్తానని ప్రకటించారు.అంతకు ముందు ఆయన నల్లగొండ పట్టణం పానగల్ లో రూ. కోటి 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన బాలసదనం, రూ. 50 లక్షల వ్యయం తో నిర్మించనున్న వయో వృద్ధుల వసతి గృహంకు, కనగల్ మండలం దర్వేశి పురం గ్రామం లో రూ. 12 కోట్ల 40 లక్షల అంచనాతో నిర్మించనున్న మహబూబ్ నగర్, నల్లగొండ రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి పునర్ నిర్మాణ పనులకి శంకుస్థాపనలు చేశారు.
జిల్లా కేంద్రంలో ఐ టీ. ఐ కళాశాల ఆవరణలో రూ. 20 కోట్లతో బ్యాక్ ఆధ్వర్యం లో నిర్మించనున్న నైపుణ్య అభివృద్ధి కేంద్ర భవనం పనులకు మంత్రి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువత కు, ఐ టి. ఐ.,పాలిటెక్నిక్,డిగ్రీ చదువుకున్న యువతీ, యువకులకు 3 నెలలకు ఒక బ్యాచ్ చొప్పున ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ బేసిక్స్,ఇంకా వివిధ కోర్సుల్లో శిక్షణ నిర్వహించి వారికి స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
వారం పది రోజుల్లో టెండర్ పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టీ ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇంకా అవసరమైతే పది కోట్ల రూ లతో అన్ని సౌకర్యాలు కల్పించి ఈ కేంద్రాన్ని రాష్త్రం లోనే మోడల్ గా రూపదించ నున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. యువత ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని తమ స్వ శక్తి తో నిరాశ చెందకుండా కష్టపడి ముందుకు వెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి,డైరెక్టర్ రాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.