Lok Sabha polling: కోలహలంగా కొనసాగుతున్న లోక్ సభ పోలింగ్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోలాహలంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభం మొదట్లో ఉదయం ప్రాంతంలో కొంతమంది కోడిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోన్నా ఆ తర్వాత ఒకరికి మరొకరు తోడై పోలింగ్ కేంద్రాలకు దారులుపట్టారు.
కడపటి సమాచారం అందేవరకు తెలంగాణలో
ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల(Lok Sabha polling) పోలింగ్ కోలాహలంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభం మొదట్లో ఉదయం ప్రాంతంలో కొంతమంది కోడిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోన్నా ఆ తర్వాత ఒకరికి మరొకరు తోడై పోలింగ్ కేంద్రాలకు దారులుపట్టారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు అందిన ఎన్నికల కమిషన్ సమాచారం మేరకు 52.60 శాతం ఓటు నమోదు కాగా, తెలంగాణలో 52.34 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 55.49 ఓటు శాతం నమోద యింది.
మధ్యాహ్నం 3 గంట వరకు తెలంగాణలో 52.34 శాతం నమోదు కావడం తో పోలింగ్(Polling) సమయం ముగిసే వరకు భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోద య్య అవకాశాలు ఉన్నాయని పరిశీలకు భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంతమంది కోడిగా ప్రారంభంలో కొనసాగినా గ్రామీణ ప్రాంతాల్లో హుషారుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలతో(Lok Sabha polling) పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరు గుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారం భం కాగా ఓటర్లు పెద్దసంఖ్యలో పో లింగ్ బూత్ల వద్ద బారులు తీరారు.
అన్ని ఉమ్మడి జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంతమేర ఇబ్బందులు పడడంతో పాటు పలుచోట్ల పోలిం గ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకే తిక సమస్యలు తలెత్తిన చోట అధి కారులు ప్రత్యామ్నాయ ఈవీఎం లు తీసుకువచ్చి పోలింగ్ ను కొన సాగిస్తున్నారు. కాగా తమ సమస్య లను తీర్చడం లేదంటూ కొన్నిచోట్ల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిం చి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం నాలుగో విడ తలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
పలు ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపు…కామారెడ్డి జిల్లా(Kama reddy) గాంధారి మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన 26 పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించడంతో పోలిం గ్ ప్రక్రియకు అంతరాయం ఏర్ప డింది. గండివేట్ నుంచి మరో ఈవీ ఎంను తీసుకువచ్చి పోలింగ్ ను కొన సాగించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మల్యాల బ్లాక్ చౌరస్తాలోని బూత్ నెంబర్ 308, రామన్నపేటలోని 311 నెంబర్ పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. కరీంనగర్ జిల్లా శకరపట్నం మండలంలోని మొలం గూరు గ్రామంలో, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని 256 పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయించాయి. రాయికల్ మం డలం మూటపల్లిలో ఈవీఎంపై ఒక పార్టీకి చెందిన సింబర్ ఉబ్బె త్తుగా ఉందని పోలింగ్ ఏజెంట్స్ అభ్యం తరం వ్యక్తం చేశారు. టెక్నీషి యన్స్ సరిచేయడంతో పోలింగ్ సజావుగా సాగుతోంది. మహబూ బాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని దుగ్గొండి మండలం పీజీ తండాలో 25 శాతం ఓట్లు పోలైన తరువాత ఈవీఎం మొరాయించింది.
ఇది ఇలా ఉండగా తెలంగాణ 17 లోక్ సభ స్థానాలకు(Lok sabha polling) కొనసాగుతున్న పో లింగ్ సజావుగా సాగుతూ ఉండ డంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగా నుండగా క్యూలైన్లో ఉన్నవారు ఓటు వేసేంతవరకు ఓటు ప్రక్రియ కొనసాగనుంది. ఆ తరువాత పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ అధికారులు ఈవీఎం బాక్స్ లను నిర్దేశించిన ఎన్నికల లెక్కింపు కేంద్రాలకు తరలించనున్నారు.
Lok Sabha polling ongoing