Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : ప్రతి విద్యార్థి ప్రయోజకుడవ్వడమే లక్ష్యం

--రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రతి విద్యార్థి ప్రయోజకుడవ్వడమే లక్ష్యం

–రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండలో చదువుకోవాలనుకునే ప్రతీ విద్యార్ధి కి అండగా ఉంటానని చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతీ విద్యార్ధి కష్టపడి చదువుకొని పైకి రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venkatreddy ) ఆకాంక్షించారు. ఇప్పటికే జి ల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పా టుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా మని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభి స్తామని తెలిపారు.

నల్లగొండ లోని కోమటి రెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో కోమ టిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ నెల 5 వ తేదీ నుంచి అందిస్తున్న పరీక్షల కోచింగ్ సెంటర్ ను కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఛైర్మన్,మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవా రం సందర్శించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్ధులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఈ కోచింగ్ కేంద్రంలో జిల్లాలోని ప్రభు త్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీ డియట్ పూర్తిచేసుకున్న విద్యార్ధిని, విద్యార్ధులకు ఉచితంగా ఎప్ సెట్ కోచింగ్ అందిస్తున్నా మని ఆయన తెలిపారు.

ఒక్క కోచింగ్ మాత్రమే కాకుండా ఉచిత హాస్టల్, భోజన వసతి, ఉచి త స్టడీ మెటీరి యల్ ను కూడా అందిస్తున్నమని ఆయన వివరించా రు. విద్యార్ధులకు కోచింగ్ ఇవ్వడమే కాకుండా, రోజు వారీ పరీక్షలు, వారంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తూ విద్యా ర్ధులను ఎప్ సెట్ కు సిద్ధం చేస్తున్నా మని ఆయన అన్నారు.

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఛైర్మన్ గా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 300 మంది విద్యార్ధులకు ఉచిత స్ట డీ మెటీరియల్ ను అందించారు. అనంతరం విద్యార్ధిని, విద్యార్ధుల తో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలు, శిక్షణ గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల నుంచి సానుకూ ల స్పందన రావడంతో కోచింగ్ సిబ్బందిని అభినందించారు.

విద్యార్ధులందరు కష్టపడి చదువుకొని మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ( pra theek foundation ) పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిం చారు. భవిష్యత్తులో విద్యార్ధు లకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే అండగా నిలబడ తానని హామీ ఇచ్చారు.

రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేష న్ నుంచి మరిన్ని పరీ క్షల శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి విద్యా ర్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు తదిత రులు పాల్గొన్నారు.