Minister komatireddy venkatreddy six guarantees :ఆడపడుచుల ఆనందం కోసమే అరుగ్యారంటీలు
--పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానధ్యేయం --వానాకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల కాల్వలకు సాగునీరు --బి. వెల్లంలలో రూ. 67 కోట్లఆర్ అండ్ బి రహదారి పనులకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆడపడుచుల ఆనందం కోసమే అరుగ్యారంటీలు
–పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానధ్యేయం
–వానాకాలం నాటికి బ్రాహ్మణ వెల్లంల కాల్వలకు సాగునీరు
–బి. వెల్లంలలో రూ. 67 కోట్లఆర్ అండ్ బి రహదారి పనులకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: రాబోయే వానకాలం నాటికి బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు కింద అన్ని కాలువలకు నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( koma tireddy venkatreddy ) తెలిపారు. శుక్రవారం అయన నకిరే కల్ నియోజకవర్గంలోని నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో సుమారు రూ. 67 కోట్ల విలువచేసే ఆర్ అండ్ బి రహదా రుల పనులకు శంకుస్థాపన చేశారు. అదే సందర్భంలో గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే పేద మహిళలకు ఇందిరమ్మ ఇంటి ( indhi ramma houses) నిర్మాణా నికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పేదలు ఎన్నో సమ స్యలు ఎదుర్కొంటున్నారన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సబ్సిడీ ఎల్పిజి కనెక్షన్, సొంత స్థలం ఉన్చ వారికి 5 లక్షల రూపాయ లతో ఇందిర ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించిన వెంటనే తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెళ్లెంల లో చంద్రమ్మ అనే మహిళకు ఇందిరమ్మ ఇంటికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించామని తెలిపారు.
బ్రాహ్మణ వెల్లెంలలో ప్రత్యేకించి తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల అవసరాల న్నీ, వారి సమస్యలన్నీ తీరుస్తామని చె ప్పారు . గ్రామంలో ఇండ్లులేని 200 మంది నిరుపేదలకు 3 ఎకరాల లో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామంలో వెట ర్నరీ ఆసుపత్రి నిర్మిస్తామని, 2 నెలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని క ట్టిస్తామని తెలిపారు. ఎట్టి పరి స్థితులలో బ్రాహ్మణ వెల్లేముల ప్రాజె క్టును పూర్తి చేస్తామని, ప్రతీక్ రెడ్డి పేరుతో లైబ్రరీని ఏర్పాటు చేస్తామ న్నారు.
గ్రామంలోని ప్రతి మహిళా సంఘానికి కోటి రూపాయలు ఇస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో లక్ష కోట్లతో మహిళా సంఘాలను కోటీశ్వ రులుగా చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. బ్రాహ్మ ణ వెళ్లేముల గ్రామంలో స్వయం సహాయక మహిళ సంఘ భవనాన్ని కట్టిస్తామని, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి సోలార్ గ్రామంగా తీర్చిదిద్దుతామ ని, అంతేకాక కెనరా బ్యాంకు శాఖను ఏర్పా టు చేస్తామని తెలిపారు.
అంతకు ముందు మంత్రి నల్లగొండ, మునుగోడు రోడ్డు వాటి ఇష్టం చేసే 30 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నార్కెట్పల్లి- మునుగోడు బ్రాహ్మణ వెల్లేంల పోర్షన్ సంబంధించి 12 కోట్ల రూపాయలతో రహదారి వెడల్పు పటిష్టం చేసే పనులకు, అలా గే నల్గొండ- మునుగోడు చిట్యాల వయా నేరడ రోడ్డు వెడల్పు, పటి స్టం చేసే 25 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరే కల్ శాసనసభలు వేముల వీరేశం,చిట్యాల మున్సిపల్ చైర్మన్ వెంక ట్ రెడ్డి తదితరులు మాట్లాడారు. రోడ్లు భవనాల శాఖ సూపరింటెం డెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డిఓ రవి స్థా నిక మండల అధికారులు ప్రజాప్ర తినిధులు తదితరులు పాల్గొన్నా రు.