MLC elections: కోదాడలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
కోదాడ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. డివిజన్ లో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో మొత్తం 12015 మంది ఓటర్లు ఉన్నారు.
కోదాడలో 73.73 శాతం పోలింగ్. శాతం నమోదు
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ డివిజన్ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC elections) సోమవారం ప్రశాంతంగా జరిగాయి. డివిజన్ లో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో మొత్తం 12015 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల ఓట్లు 8120 కాగా మహిళలవి 4065 ఓట్లు ఉన్నవి. ఇందులో మొత్తం 8984 మంది పట్ట బద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పురుషులు 6070 మహిళలు 2914 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. కోదాడ పట్టణంలోని ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోదాడ పట్టణ సిఐ రాము ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల(Polling centers) వద్ద 200 మీటర్ల పరిధితో కేంద్రాల వద్ద ఓటర్లు గుమి కూడకుండా చేపట్టిన చర్యలు ఉపయోగపడింది. పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు బయట ఓటర్లకు పోలింగ్ చిట్టిలను అందజేస్తూ తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.Kodad
MLC election peaceful in