Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mlc Kavitha CBI : అదేమిటో తెలుసా లిక్కర్‌ కేసులో మరో లిటికేషన్

--జైలులో ఉండగానే సిబిఐ అరెస్టుతో కొత్త ట్విస్ట్  --ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ --కొనసాగుతోన్న ఇరు పక్షాల వాదనలతో ఉత్కంఠ 

అదేమిటో తెలుసా

లిక్కర్‌ కేసులో మరో లిటికేషన్

–జైలులో ఉండగానే సిబిఐ అరెస్టుతో కొత్త ట్విస్ట్ 

–ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ
–కొనసాగుతోన్న ఇరు పక్షాల వాదనలతో ఉత్కంఠ 

ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: దేశంలోనే సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్క ర్‌ స్కామ్‌ కేసులో మరో లిటికేషన్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ( Delhi liquor case) అరెస్ట్‌ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవితకు కష్టాలు మరింతగా రెట్టింపయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న కవితను అక్కడే గురువారం అరెస్ట్ చే సిన సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు పరిచారు.

ఐదు రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి కోరడం గమనార్హం. ఢిల్లీ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన స మావేశాలు జరిపినట్లు సీబీఐ (CBI) వెల్లడిస్తోంది. కవిత ఆడిటర్ బుచ్చి బాబు వాంగ్మూలం ప్రకారం ఇందులో విజయ్ నాయర్, మా గుంట శ్రీనివాసులు రెడ్డి సహా అనేక మంది ముఖ్య నేతలు ఉన్నట్లు స్పష్ట మవుతోందని సిబిఐ కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోంది.

సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు సమీకరించి నట్లు వాట్సప్ చాట్ ధృవీకరి స్తోందని సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనాల్లో పేర్కొంటు న్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను కోర్టుకు అందజేశా మని అందుకే ఆమెను విచారించాలని సీబీఐ ఢిల్లీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తిని కోరుతోంది.

ఈ కేసులో విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగు లోకి వచ్చే అవ కాశం ఉందని వాదిస్తోంది. ఇప్పటికే ఈడీ దర్యాప్తులో భాగంగా అరెస్టై జైలు జీవితం గడుపుతున్న ఎమ్మె ల్సీ కవిత మరోసారి సిబిఐ చేత అరెస్ట్‌ కావడం సంచలనం సృష్టిం చిన విషయం తెలిసిందే. అ యితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బయటకు రావాలంటే ఒకటికి మరొక టి అంటే రెండు బెయిల్స్‌ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఇదిలా ఉంటే ఒకే కేసులో రెండు అరెస్ట్‌ లు ఎమ్మెల్సీ కవితను వెం టాడడం భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఈడీ అరెస్ట్‌తో ఇప్పటికే తిహార్‌ జైలులో ఉన్న కవితను సీబీఐ కూడా అరెస్ట్‌ చేసింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తో కలిసి కవిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది.

మరోవైపు, ఎలాంటి నోటీసు లేకుండా కవితను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్‌ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరఫు లాయర్లు. అయితే తన ముందు లిక్కర్‌ కేసు వాదనలు జరగలేదన్న జడ్జి మనోజ్‌ కుమార్ ఈ కేసులో తాను ఎ లాంటి రిలీఫ్ ఇవ్వ లేనని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 10 గం టలకు కోర్టులో పిటిషన్‌ వేయాలని సూచించారు.

మద్యం పాలసీ కేసులో గత నెల 15న ఈడీ అధికారులు ( ED officers) హైదరాబా ద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16 వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది.

ఇప్పుడు ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసు లోనే కాదు సీబీఐ కేసు లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఢిల్లీ లిక్కర్‌ కేసు కవితను గట్టిగానే పట్టుకున్నట్టు కనిపి స్తోంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే కవిత సుదీర్ఘకాలం జల జీవితం అనుభవించాల్సి ఉంటుందన్న సంకేతాలు స్పష్టంగా తెలియ వస్తున్నాయి.