Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS MLC Candidate Rakesh reddy:కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బెయిల్ కు టికెట్ ఇచ్చి సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి.

సమాజానికి పట్టిన చీడపురుగు నయా నయీమా....!ప్రశ్నించే గొంతుక రాకేశ్ రెడ్డి నా. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ రాకేష్ కుమార్ స్పష్టం చేశారు.

*ప్రజా సేవ కోసం ఉన్నత ఉద్యోగాలు వదులుకున్న ఏనుగుల……
*పార్టీలకతీతంగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. రాకేష్ కుమార్

ప్రజా దీవెన, కోదాడ:సమాజానికి పట్టిన చీడపురుగు నయా నయీమా….!ప్రశ్నించే గొంతుక రాకేశ్ రెడ్డి నా. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ రాకేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం కోదాడ(Kodada) టిఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాజీ ఎమ్మెల్యే మల్ల య్యయాదవ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం.

ఆడవాళ్ళ ఫోటోలు మార్చడం. అవమానించటం.. రాజకీయ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడటం ఇప్పటికే తదితర అభియోగాలపై 56 క్రిమినల్ కేసులను పునికి పుచ్చుకున్న నయా నయీమ్కు తగిన బుద్ధి చెప్పిఉన్నత విద్యావంతుడు. మేధావి తెలంగాణ(Telangana) ప్రజల ఆకాంక్షల పట్ల శాస్త్రీయ అవగాహన ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు(Vote) వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు… రాష్ట్రంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులను తిట్టిన తిట్టు తిట్టకుండా దుర్భాషలాడిన తీన్మార్ కు టికెట్ ఎలా ఖరారు చేశారో వారికే తెలియాలని అవహేళన చేశారు..

కోమటిరెడ్డి అన్నదమ్ములతోపాటు ఉత్తమ కుమార్ రెడ్డిని తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna)ఏ స్థాయిలో విమర్శించిన విషయం మనందరికీ తెలిసిందే అన్నారు అటువంటి సమాజ చీడ పురుగుకు టికెట్ ఖరారు చేసి సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థి గెలిస్తేనే అధికార పక్షాన్ని నిలదీసి సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అందుకే విద్యార్థి నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల సమస్యలను శాసనమండలి లో ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి(Rakesh Reddy)అని ఆయనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్ట బద్రులను కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్(Job calendar) ప్రకటించకపోవడంతో పాటు ఏ శాఖలోనూ ఒక పోస్ట్ కూడా భర్తీ చేయనప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదో నిరుద్యోగపట్టబద్రులు నిలదీయాలన్నారు.. రాకేశ్ రెడ్డి ని గెలిపిస్తే తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్న బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని.. అదే తీన్మార్ మల్లన్న అయితే. చీటింగ్ ఎలా చేయాలో నేర్పుతారని ఎద్దేవా చేశారు.. ఓ పక్క రాష్ట్రంలో అన్నదాతలు సాగునీరంధక పంట పొలాలు ఎండిపోతే..

కాంగ్రెస్(Congress) పార్టీ పక్షాన ఎన్నికల బరిలో నిలిచిన నయా నయీంతో పాటు పది సంవత్సరాలు దేశాన్ని పాలించిన భాజపా ప్రభుత్వం ఏ వర్గానికి వరగపెట్టింది ఏమీ లేదని శ్రీరాముడు పేరు చెప్పుకొని కాలం వెళ్లదీస్తున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకున్నారని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కనీసం వ్యతిరేకించని బిజెపి(BJP) పార్టీ పక్షానఎమ్మెల్సీ అభ్యర్థి గా నిలిచిన వ్యక్తికి ఓటు వేసిన ప్రయోజనం ఉండదన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాల గొంతుకై  ఒక్క రాకేష్ రెడ్డి మాత్రమే వినిపించి ఈ సమస్యలు పరిష్కరించేందుకు నిబద్ధతతో పని చేస్తారని అందుకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నత ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశారని పేర్కొన్నారు…. ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ నాయకుడు యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు…

MLC ticket give to tinmaar mallanna