బిగ్ బ్రేకింగ్, వారందరికీ వేతనాలు పెరిగాయoట, మీకు తెలుసా
MPsalaryhike : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారతదేశ వ్యాప్యంగా ఎంపికైన ఎంపీల వేత నా లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలుసా.. ఇ ప్పటి వరకు ఇచ్చే లక్ష రూపాయల జీతాన్ని లక్షన్నరకు పెంచింది జీతం తో పాటు మిగతా పెసిలిటీస్ కూడా పెం చుతున్నట్టు కేంద్రం వెల్లడి స్తోంది. మాజీ ఎంపీలకు ఇచ్చే పిం ఛన్ కూ పెంచుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2023 ఏప్రిల్ నుంచి కొత్త శా లరీలు అమలులోకి వస్తా యని కేంద్రం పేర్కొంది. దీని ప్రకా రం ప్రతి ఎంపీకి రెండు ఏళ్ల బకా యిలు కూడా రానున్నాయి.
ప్రస్తుతం ఒక్కో ఎంపీ లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఆ జీతా న్ని లక్ష 24 రూపాయలకు పెంచా రు. మాజీ ఎంపీలకు ఇచ్చే పాతిక వేల రూపాయల పింఛన్ను 31 వేలకు పెంచారు.రెండేళ్ల బకాయి లను కూడా కేంద్రం ఎంపీలకు చె ల్లించనుంది. దీనికి సం బంధించిన గెజిట్ నోటిఫికేషన్ సోమవారం వి డుదలైంది. ఈ నోటి ఫికేషన్ ప్రకా రం 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త శాలరీలు అమలు అవుతాయి. అంటే రెండేళ్ల బకాయిలను కూడా కేంద్రం ఎంపీలకు చెల్లించనుంది.
శాలరీలతోపాటు సభకు హాజరైతే ఇచ్చే డైలీ అలవెన్స్ కూడా పెం చింది. ఇప్పటి వరకు ఒక ఎంపీ సభకు హా జరైతే రోజుకు 2000 రూపాయలు ఇచ్చే వాళ్లు ఇకపై దాన్ని 2500కు పెంచారు. ఐదేళ్ల కుపైగా సేవలు అం దించిన ఎంపీలకు అదనంగా మరో 2000 రూపాయలు ఇచ్చే వాళ్లు. దాన్ని 2500కు పెంచారు.ఎంపీల శాల రీలు, ఇతర అలవెన్స్లు 20 18లో ఒకసారి పెంచారు. మళ్లీ ఇ ప్పుడు పెంచారు. మొత్తం ఇప్పుడు 543 లోక్సభ, 245 రాజ్యసభ ఎం పీలకు వర్తించనుంది. వీళ్లతో పాటు గతంలో ఎంపీలుగా పని చేసిన మాజీ లకు కూడా ఈ పెంపు మేర కు చెల్లింపులు చేస్తారు.
పదవిలో ఉన్న ప్రతి ఎంపీకి ఈ శాలరీతో పాటు అదనంగా మరికొన్ని నిధులు కేంద్రం ఇస్తుంది. వారు ఎన్నికైన పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఖర్చుల కోసం నెలకు 70వేల రూ పాయల అలవెన్స్ను కేం ద్రం ఇస్తుంది. వీటితోపాటు స్టాఫ్, స్టేషనరీ, టె లిఫోన్ సహా ఇతర ఖర్చుల కోసం మరో 60వేల రూపాయలు కూడా మంజూరు చేస్తోం ది. ప్రధానమంత్రి కి, కేబినెట్ మంత్రులైన వాళ్లకు మరిన్ని వెసులు బాట్లు కలిగించింది. నిధులే కాకుండా ఎంపీతో పాటు భార్య లేదా భర్త ఏడాదిలో 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. ఫస్ట్క్లాస్ ఏసీ కోచ్లో రైలు ప్రయాణం ఉచితం కూడా చే యవచ్చు.
రోడ్డు రవాణాలో వెళ్తే కిలోమీటర్కు రూ.16 చొప్పున బి ల్లు ఇస్తారు. ప్రైమ్ లోకేష్లో ఉం డాలంటే అందుకు రెంట్ కూడా కేంద్రమే చెల్లి స్తుంది. ఒకవేళ సొంత ఇల్లు ఉండి కేంద్రం నుంచి అద్దెతీసుకోకపోతే బిల్లులు పెట్టుకొని కేం ద్రం నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూ లు చేసుకోవచ్చు.50 వేల యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 4వేల కిలోలీటర్ల తాగునీరు కూడా ఉచి తంగా కేంద్రం అందిస్తుంది. పాథా లాజికల్ లాబొరేటరీ సౌకర్యం, ఈసీ జీ, దంత, కంటి, చర్మ ఆరోగ్య సేవలు ప్రీగా పొందవచ్చు. మూడు టెలిఫోన్ కనెక్షన్లు ఉచితంగా వాడుకో వచ్చు.
ఏడాదికి 50 వేల ఉచి త కాల్స్, స్మార్ట్ ఫోన్ ద్వారా 1.50 లక్షల కా ల్స్ మాట్లాడుకునే వీలు కల్పిస్తుంది కేంద్రం.ప్రధానమంత్రికి, కేబినె ట్ మంత్రులైన వాళ్లకు మరి న్ని వెసులుబాట్లు ఉంటాయి. ప్రధా నమం త్రిగా ఎన్నికైన వ్యక్తికి ఎంపీ కోటాలో వచ్చే నిధులు, ఇతర సౌ కర్యాల తోపాటు అదనంగా నెలకు 3వేల అదనపు అలవెన్స్ వస్తుంది. కేంద్ర మంత్రులకు నెలకు రెండు వే లు, సహాయ మంత్రులకు వెయ్యి రూ పాయలు ఇస్తారు. ఇలా ఎంపీ ల జీతాలను ప్రతి ఐదేళ్లకు పెంచా ల ని 2023 ఏప్రిల్ 1ని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు పెంచినట్టు ఇప్పుడు గెజిట్నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.