బిగ్ బ్రేకింగ్, దివి నుంచి భువికి దిగివచ్చిన సునీతా విలియమ్స్
NASASunithawilliams: ప్రజా దీవెన హైదరాబాద్: ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చి క్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణించిన వ్యోమ నౌక ఎట్టకేలకు భూమికి చేరుకొంది. భారత కాలమానం ప్రకారం మార్చి 19వ తేదీ తెల్లవారు జామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ఇది దిగింది. అప్పటికే అక్కడకు చేరుకున్న సహాయ బృందా లు క్రూ డ్రాగన్ను వెలికితీశాయి. ల్యాండింగ్ అనంతరం వీరిద్దరిని హ్యూస్టన్లో ని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు.అక్కడ వారికి వైద్య పరీ క్ష లు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యోమనౌక మొరాయించడంతో తొమ్మిది నెల లుగా అంతరిక్షంలోనే ఉండిపోయి న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భువిపై సురక్షి తంగా అడుగుపెట్టడం అందరినీ ఆకట్టు కుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవా రు జామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.. డ్రాగ న్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి.
ఆ తర్వాత ఆస్ట్రో నాట్లను స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూ ల్ నుంచి బయ టకు తీసుకొచ్చారు. ఊహించని సవాళ్లు, చారిత్రా త్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా పుడమిని చేరినట్లు నాసా ప్రకటించిం ది.ఫ్లోరిడా తీరంలో స్పేస్ఎక్స్ క్రూ- 9 మిషన్ భూ మి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా X, యూ ట్యూబ్, NASA లో లైవ్ ప్రసారం చేసింది. దివి నుంచి భువికి చేరి న వారిలో సునీతా విలి యమ్స్, విల్మోర్తో పాటు స్పేస్ ఎక్స్ క్రూ-9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.