Inquiry on Electricity: విద్యుత్ పై విచారణకు నోటిఫికేషన్
తెలంగాణలో విద్యుత్తు(Telangana Electricity) వ్యవహారంలో విచా రణ ప్రారంభమైంది. విచారణకు సంబంధించి గతంలోని నియామ కమైన జస్టిస్ నరసింహారెడ్డి కమి షన్ కార్యాచరణను ప్రారంభిం చింది.
జారీ చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం,ఛత్తీస్గఢ్తో ఒప్పందంపై ఫిర్యాదులకు ఆహ్వానం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్తు(Telangana Electricity) వ్యవహారంలో విచా రణ ప్రారంభమైంది. విచారణకు ( Inquiry on Electricity)సంబంధించి గతంలోని నియామ కమైన జస్టిస్ నరసింహారెడ్డి కమి షన్ కార్యాచరణను ప్రారంభిం చింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ(Yadadri and Bhadradri thermal plants) పనులను నామి నేషన్ పద్ధతిలో కట్టబెట్టడం, అవస రం లేకున్నా ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వంటి కార ణాలతో జరిగిన నష్టంపై 10 రోజు ల్లోగా ఫిర్యాదులు అందజేయాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ కోరింది.
ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. పోటీ బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్ గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవ డం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా దాన్ని కాదని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ను(Bhadradri thermal plants) కట్టడం, కోల్బెల్ట్ కు 179 నుంచి 388 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంపై ప్రభు త్వం జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృ త్వంలో కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆయా ఒప్పందాల వల్ల జరిగిన నష్టంపై నివేదించాలని కమిషన్ సూచించింది.
ఈ మెయిల్ (coi20 24.power@gmail.com)కు లేడంటే కమిషన్ కార్యాలయం, 7వ అంతస్తు, బీఆర్కేఆర్ భవన్, ఆద ర్శనగర్, హైదరాబాద్–500004 చిరునామాకు రాతపూర్వక ఫిర్యా దులను 5 లేదా 6 పేజీల్లో పంపా లని కోరారు. ఇక నివేదించే వారు లేదా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా, వ్యక్తులు లేదా అధికారులను టార్గెట్ చేసుకో కుం డా ఫిర్యాదు చేయాలని కమిషన్ కోరింది. ఎవరైనా మౌఖిక సాక్ష్యా లు ఇవ్వాలని భావిస్తే వాటి ఉద్దేశం సూచించాలని, దీని కోసం తగిన సమయం ఇచ్చి, సాక్ష్యం తీసుకుం టామని కమిషన్ పేర్కొంది.
కాగా, తెలుగు పత్రికల్లో ఇచ్చిన నోటిఫికేష న్ 3వ పేరాపై పలువురు అభ్యంత రాలు వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ లో నివేదనలకు ఎటువంటి రాజకీ య సమస్యలు లేదా దాడులు లేకుండా సదరు వ్యక్తులు రూఢీ పరుచుకోవాలని ఉండడంపై పబ్లిక్ పాలసీ నిపుణుడు దొంతి నర్సిం హారెడ్డి, కె.బాబూరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు అనువాదం లో లోపాల వల్ల పెడార్థం వచ్చేలా నోటిఫికేషన్ వచ్చిందని పేర్కొన్నా రు. కాగా ఫిర్యాదులకు 10 రోజులే అవకాశం ఇవ్వడంపై అభ్యంత రాలు వ్యక్తమయ్యాయి. కనీసం నెల రోజులైనా సమయం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
Notification of Inquiry on Electricity