PawanKalyan: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రము ఖ సినీ నటుడు, పవర్ స్టార్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ క ళ్యాణ్ ఒకింత ఉద్వేగానికి లోన య్యారు. సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి తన కుమారుడు మార్క్ శంకర్ సమస్త సమాజం తో కూడిన అందరి ఆశీస్సులతో కోలు కుంటు న్నాడని పవన్ కళ్యాన్ తెలిపారు.ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసు పత్రి లో చికిత్స పొందుతున్నాడని పవన్ తెలిపారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న ప్ర ధాని నరేంద్ర మోడీ తనకు ఫోన్ చే సి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి ధైర్యం చెప్పార ని, అ వసరమైన సహాయం అందించా లని సింగపూర్లోని హైక మి షనర్ ను ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడార ని, మార్క్ శంకర్ త్వరగా కోలుకో వాలని ఆకాంక్షించినట్టు తెలిపారు. అలాగే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నా యుడు ఫోన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ గవ ర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తె లం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్, తమిళనా డు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కె.ఆచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు పరామర్శించారని తెలిపారు.
అదేవిధంగా దుర్గేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్య క్షు లు డా.కె.లక్ష్మణ్, బి.ఆర్.ఎస్. వ ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎం పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వా రా, వివిధ మాధ్య మాల ద్వారా మార్క్ శంకర్ కోలు కోవాలని ఆకాం క్షించారని ఇంత మంది మంచి మనసుతో ఆకాం క్షించి, ఆశీ స్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొం టు న్నాడని, ప్రతి ఒక్కరికీ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచే స్తు న్నానని పవన్ కళ్యాణ్ అన్నా రు.