Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

jagannath temple: బిజూ జనతాదళ్ హయాంలో ప్రమాదంలో జగన్నాథ ఆలయం

ఒడిస్సా రాష్ట్రం లో బిజూ జనతాదళ్ హయాంలో పూరీలోని జగన్నాథ ఆలయం ప్రమాదంలో పడిందని, సురక్షితంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

అవినీతిపరుల నియంత్రణలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం
ఒడిశా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

ప్రజా దీవెన ఒడిశా: ఒడిస్సా రాష్ట్రం లో బిజూ జనతాదళ్ హయాంలో పూరీలోని జగన్నాథ ఆలయం(Jagannath temple) ప్రమాదంలో పడిందని, సురక్షితంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఆరోపించారు. ఒడిశా ప్రభుత్వం పూర్తిగా అవినీతిపరుల నియంత్రణలో ఉందని మండిప డ్డారు.ఒడిశాలో తొలిసారిగా బీజేపీ డబుల్ ఇంజిన్(Double engine) ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. సోమ వారం ఆయన ఒడిశాలో పర్యటిం చారు. ఈ సందర్భంగా ధెంకనల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిం చారు.ఒడిశాలో నీరు, అడవి భూమి ఉన్నప్పటికీ అత్యం త దుర్భరమైన పరిస్థితులు ఉన్నా యని తెలిపారు.

25ఏళ్లుగా బిజూ జనతా దళ్(బీజేడీ) ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. రాష్ట్రం లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్ప డ్డాక అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. గత పదేళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశ ప్రజలంతా చూశార న్నారు.

21వ శతాబ్దపు ఒడిశా(Odisha) అభివృద్ధిలో వేగం కావాలని, అది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశా రు. బహిరంగ సభకు ముందు మోడీ ఒడిశాలోని పూరీలో రోడ్ షో నిర్వహించారు. పూరీలోని జగన్నా థ ఆలయంలో పూజలు చేశారు. పూరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశాలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరు గుతుంది.

Prayed to Mahaprabhu Jagannath in Puri