గోపాలపురం వద్దడివైడర్ ఢీకొట్టిన బైక్ ఇద్దరు వ్యక్తులు మృతి.
తన సొంత ఊరిలో గంగ దేవమ్మ పండగ ఉందని ఆ పండుగకు వచ్చి ప్రస్తుతం తను ఉంటున్న చౌటపల్లి గ్రామానికి బైక్ పై వెళ్తుండగా ఆ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఆ వ్యక్తితో పాటు అతని సోదరిని కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా
మరొకరికి గాయాలు పరిస్థితి విషమం
ప్రజా దీవెన ,కోదాడ: తన సొంత ఊరిలో గంగ దేవమ్మ(Goddess Ganga) పండగ ఉందని ఆ పండుగకు వచ్చి ప్రస్తుతం తను ఉంటున్న చౌటపల్లి గ్రామానికి బైక్ పై వెళ్తుండగా ఆ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఆ వ్యక్తితో పాటు అతని సోదరిని కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అతని కూతురికి తీవ్ర గాయాలైన హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంఘటన బుధవారం మధ్యాహ్నం హుజూర్ నగర్ మండలంలోని గోపాలపురం(Gopalapuram) వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కుర్ర సైదులు(39) తను జీవనోపాధి కోసం మఠంపల్లి మండలం చౌటుపల్లి లో స్థానికంగా ఉంటూ మఠంపల్లి(Mathampally)మండలంలోని ఒక ఫ్యాక్టరీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం (సోమవారం )వెంకట్రాంపురం గ్రామంలో గంగ దేవమ్మ పండుగ యాదవ కులస్తులు నిర్వహించారు. ఆ పండగలో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితమే వెంకట్రాంపురం వచ్చారు.
అలాగే ఆయన సోదరుడు కుర్ర వీర వెంకన్న హుజూర్ నగర్ లో(Huzur Nagar)ఉంటున్నాడు. పండగ అయిపోవడంతో తిరిగి ప్రస్తుతం ఉంటున్న చౌటుపల్లి కి హుజూర్ నగర్ మీదుగా వెళ్తున్నాడు .సైదులు భార్య రమాదేవి కూతుర్లు సౌమిక జస్మిక అతని సోదరుడు కూతురు స్వాతి ఉండడంతో భార్య రమాదేవిని చిన్న కూతురు జస్మికను బస్సు ఎక్కించి అతన్ని సోదరుడైన వీర వెంకన్న కూతురు శ్రీనిజ(Srinija)(8)తోపాటు తన కూతురైన సౌమిక(soumika)తన బైక్ పై ఎక్కించుకొని హుజూర్ నగర్ వెళ్తుండగా హుజూర్ నగర్ మండలంలోని గోపాలపురం గ్రామం వద్ద ఆ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో కుర్ర సైదులు అతని సోదరుడు కుమార్తె శ్రీ నిజ అక్కడికక్కడే మృతి చెందింది. కుర్ర సైదులు కుమార్తె సౌమిక తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Road incident in gopalapuram