Rythu bandhu: కౌలు రైతులకు రైతుబంధు వర్తింపచేయాలి: రైతు సంఘం అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు(farmers) రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నం పాపిరెడ్డి బొల్లుప్రసాదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు(farmers) రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నం పాపిరెడ్డి బొల్లుప్రసాదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు కౌలు రైతులకు రైతుబరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా(strike) నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కౌలు రైతులకు ఋణ అర్హత కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు,
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు చేసి న్యాయం చేయాలనిరైతాంగానికి వారు డిమాండ్ చేశారు ధర్నా అనంతరం సూపర్డెంట్ మెమోరాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్ కౌలు రైతుసంఘం(farmer society) నాయకులు చిన్నం వెంకట్ రెడ్డి నాగేశ్వరరావు నీలం నాగభద్రం కుటుంబరావు కనగాల గిరి అలవాల చంద్రయ్య ఎన్నబోయిన శ్రీను జల్లి పుల్లయ్య వాము తిరపయ్య బానోతు నాగేశ్వరావు నెల్లూరు రామారావు అలవాల వెంకటి బైరబోయిన వెంకటేశ్వర్లు మందరపు రామయ్య నాగేశ్వరరావు బండారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Rythu Bandhu applied to tenant farmers