Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sanga Reddy: కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కసాయి

ఆయనొక  నరరూప రాక్షస కుమారుడు, సద రు ఉద్దండుడు అత్యాసకు పోయి వ్యసనాలకు లోనై కన్న తల్లి దండ్రు లనే కడతేర్చాడు. ఇటువంటి కసా యి కొడుకు.

పేగు బందం మరిచి మానవ మృ గాలుగా మారిన కొడుకు, కోడలు
తల్లి దండ్రుల ఆచూకీ కోసం కూ తురు జల్లడపట్టిన వైనం
ఆమె ఆందోళనతో కిష్టయ్య, న ర్సమ్మల విషయం బయట పడింది
25 రోజుల తర్వాత వీడిన సాకలి కిష్టయ్య, నర్సమ్మ డెత్ మిస్టరీ

ప్రజా దీవెన, సంగారెడ్డి: ఆయనొక  నరరూప రాక్షస కుమారుడు, సద రు ఉద్దండుడు అత్యాసకు పోయి వ్యసనాలకు లోనై కన్న తల్లి దండ్రు లనే కడతేర్చాడు. ఇటువంటి కసా యి కొడుకు. సంగారెడ్డి(Sanga reddy) జిల్లా హ త్నూర మండలానికి చెందిన సాదు ల్లనగర్ నివాసి అయిన సాకలి లక్ష్మ న్ బ్రతుకు తెరువు కొరకు దుండ గల్ లొ ఒక ప్రైవేట్ ఉద్యోగం చె య్యడానికి వెళ్ళాడు. అక్కడ అనేక దురువ్యసనాలకు లోనైన లక్ష్మన్ డబ్బుల కొరకు కన్న తల్లి మెడలో ఉన్న బంగారం పై కన్ను పడింది.

ఎలాగైనా బంగారం తల్లి దగ్గర నుండి తీసుకోవడానికి పక్కా పథ కం ప్రకారం గత నెల మే 22 రోజున తన తల్లి తండ్రులను దుందిగల్ తీసుకెళ్లాడు. అందరూ కలిసి ఆల్క హాలు సేవించి విందు చేసుకున్నా రు. నిందితుడి భార్యతో కలిసి 3.5 తులాల బంగారం మీద కన్నేసి సమయం కోసం ఎదురు చూశారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నిద్రలో జరు కున్న తర్వాత సొంత తల్లి దండ్రుల (Parents)ను గొంతునులిపి కడతేర్చాడు. దా నికి అతని భార్య అనిత పూర్తిగా సహకరించినట్టు తేటతెల్లమైంది. ఆ తర్వాత కారులో నర్సాపూర్ అటవీ సమీపంలోని రాయరావు చెరువు చెట్ల పొదల్లో తల్లిదండ్రుల శవాల పై పెట్రోలు పోసి నిప్పంటించాడు నికృష్టపు కొడుకు. ఇట్టి విషయాన్ని గప్ చుప్ గా ఉంచిన భార్య భర్తలు (Wife and husband)ఏమి తెలువనట్టు ఉన్నారు. ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెత కని ఊరు లేదు, వెత కని జాడ లేదు.

ఇక పుట్టిన ఊరికి వచ్చి తన తల్లిదండ్రుల గురించి వాకబు చేసింది. అంతలో సాదుల్లా నగర్(Sadulla nagar) లొ విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ప్రజలు గుమిగూడి కిష్టయ్య, నర్సమ్మ ల గురించి కొడుకు లక్ష్మన్ ని అడకూతురు గ్రామస్తులు కలిసి నిలదీశారు. గ్రామస్తులు కలిసి తల్లిదండులను నీవే తీసుకపోయావు ఏమిచేశావు అంటూ నిలదియ్యడంతొ నిందితుడు ఖంగుతున్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి లక్ష్మన్ పై పోలీసులకు (Police complaints)ఫిర్యాదు చెయ్యడంతొ తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించినట్టు తెలిసింది. ఇట్టి విషయమై నింధితులైన లక్ష్మన్ అతని భార్య అనిత ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

Sangareddy District Hatnoora Mandal