Secundrabad contonment ghmc : కంటోన్మెంట్ కల నెరవేరింది
--జిహెచ్ఎంసి లోకి రావడంతో తీరిన కంటోన్మెంట్ వాసుల కోరిక --బోర్డు పరిధిలోని సివిల్ ఏరియా లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం --జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
కంటోన్మెంట్ కల నెరవేరింది
–జిహెచ్ఎంసి లోకి రావడంతో తీరిన కంటోన్మెంట్ వాసుల కోరిక
–బోర్డు పరిధిలోని సివిల్ ఏరియా లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం
–జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సికింద్రా బాద్ కంటోన్మెంట్ ( secundra ba d contonment) వాసుల చిరకాల కోరిక నెరవేరేందుకు సమయం ఆస న్నమైంది. కంటోన్మెంట్ బోర్డు పరి ధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ ఎంసీ (ghmc) లో విలీనం చేసేందు కు కేంద్ర ప్రభుత్వం (union gove rnment) ఆమోదం తెలిపింది. అం దుకు సంబంధించిన మార్గదర్శ కాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
కంటోన్మెంట్ బోర్డును జీహె చ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్య మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ( CM revanth reddy) ప్రత్యే క చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లి నప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టి కి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ( modi) ని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటి నీ రద్దు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చే యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయా లని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (cs santhakumaari) ఇటీవల కేంద్ర రక్షణ శాఖకు లేఖ కూడా రాశారు.
ఈనెల 25 కేంద్ర రక్షణ శా ఖ (defenc minister) కార్యదర్శి రా ష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ లో నూ విలీన ప్రక్రి యను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తె లిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి విధా నాలపై లేఖ రాశారు.
దీని ప్రకారం కంటోన్మెంట్ లోని సివిల్ ఏరియా ( civil areas) ల ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌ కర్యాలు, మౌలిక వస తులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తా రు. కంటోన్మెంట్ బోర్డు ల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బది లీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపా లిటీకి బదిలీ అవుతాయి.
మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్ లోని నివాస ప్రాంతాలకు జీ హెచ్ ఎంసీ పరిధి విస్తరిస్తుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్ను లను విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్ప ష్టం చేసింది.
కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది.
Secundrabad contonment ghmc