పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు
ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా లో 313 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు
3000 మంది సిబ్బంది, 7 కేంద్ర బలగాలతో నిఘ
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి
జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన నల్గొండ: ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు(Parliament elections) జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 9 మంది డిస్పీలు,37 మంది సీఐలు,84 మంది యస్.ఐలతో కలిపి మొత్తం 3000 మంది సిబ్బంది, 7 కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
వీటితో పాటు 5 ప్లాటున్ల టి ఎస్ ఎస్ పి సిబ్బంది, పెట్రోలింగ్(petroling)పార్టీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూఆర్టి ), స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 313 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర పార మిలటరీ బలగాల ద్వారా పటిష్ఠ భద్రత, ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి పోలింగ్(Polling centers)కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో(Peaceful atmosphere) ప్రజలు ఓటు హక్కు వినియోగించుకావాలని కోరారు. శాంతి భద్రతల కి విఘాతం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా, 5 గురు కంటే ఎక్కువ తిరగరాదని అన్నారు. ఓటర్లను(voters) ప్రలోబ పెట్టే డబ్బు,మద్యం ఇతర సంబంధిత వస్తువులు ఎవరైనా పంచితే వెంటనే సి.విజిల్ యాప్ లో అప్ లోడ్ చేయుటకు డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Security arrangements for Parliament elections