Singarenituwj : సింగరేణి కార్మికుల పక్షపాతి జర్నలిస్ట్ మునీర్
--టియుడబ్ల్యూజే 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లంనారాయణ
Singarenituwj : ప్రజా దీవెన, మంచిర్యాల: సీనియర్ జర్న లిస్ట్ మునీర్ సంస్మరణ సభను మునీర్ అన్న యాదిలో పేరుతో ( TUWJ H -143)తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. మంచిర్యాల జిల్లా కేంద్రం లో గత 30 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా పని చేసిన మునీర్ ఇటీ వల అనారోగ్యంతో మృతి చెందారు. అతని స్మారకంగా జర్నలిస్టు లు నిర్వహించిన సభకు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టియు డబ్ల్యూజే 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ , రాష్ట్ర కోశాధికారి యోగి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రా వు లు పాల్గొని నివాళులు అర్పించారు. ము నీర్ తో వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అనం తరం అల్లం నారాయణ మాట్లాడారు.
మునీర్ ప్రజల మనిషి అని ప్రజా సమస్యల పై ఎన్నో వార్తలు రాసా డని అన్నారు.సింగరేణి అంటే అత ని ఎంతో ఇష్టం అని సింగరేణి పై ఎ న్నో ఆర్టికల్స్ రాసాడని అన్నా రు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించాడని సిం గరేణి జేఏసీ చైర్మన్ గా ఎంతో పోరా టం చేశాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునీర్ అన్న సో దరుడు అడ్వకేట్ సందాని, కుమా రుడు మయూర్, మంచిర్యాల కన్వీ నర్ ఉమేష్,కో కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్, చెట్ల రమేష్, కొమురం భీం జిల్లా కన్వీనర్ రవి నాయక్, జర్నలిస్టులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు ,కార్మిక సంఘాల నాయ కులు,మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నా రు.