Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Strong movements: బలమైన ప్రతిఘటన పోరాటాలే నిజమైన నివాళి

సిపిఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు,ఉమ్మడి నల్లగొండ జిల్లా అగ్ర శిఖరం, మాజీ కార్యదర్శి, జనం మనిషి కామ్రేడ్ జన్ను సార్ అలియాస్ జెన్ను భాయ్ జలగం జనార్దన్ మూఢవ వర్ధంతి సందర్భం గా నల్లగొండ లోని శ్రామిక భవన్ లో సీపీఐ ఎమ్- ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ :సిపిఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ(CPI M-L New Democracy) రాష్ట్ర కమిటీ సభ్యులు,ఉమ్మడి నల్లగొండ(Nalgonda) జిల్లా అగ్ర శిఖరం, మాజీ కార్యదర్శి, జనం మనిషి కామ్రేడ్ జన్ను సార్ అలియాస్ జెన్ను భాయ్ జలగం జనార్దన్ మూఢవ వర్ధంతి సందర్భం గా నల్లగొండ లోని శ్రామిక భవన్ లో సీపీఐ ఎమ్- ఎల్ న్యూడెమోక్రసీ((CPI M-L New Democracy)) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ముందుగా కామ్రేడ్ జెన్ను భాయ్ చిత్రపటానికి పూలమాలలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమో క్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ మాట్లాడుతూ కామ్రేడ్ జెన్ను సార్ మరణం విప్లవోద్య మానికి, కార్మిక, రైతాంగ, ప్రజా ఉద్యమాలకి తీరనిలోటని అన్నా రు. ప్రజా విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లను నిర్బంధాలను, అక్రమ అరెస్టులను తట్టుకొని తాను నమ్మి న సిద్ధాంతాన్ని కడవరకు ఆచరించాడని కొనియాడారు, కష్టాల బాటలో కష్టజీవుల కు అండగా నిలిచిన ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు నాయకుడు(communist leader) కామ్రేడ్ జనార్దన్ జెన్ను అని తెలిపారు, గోదావరి లోయ ప్రతిఘటన పోరాట బాటలో, సి పి రెడ్డి నిర్మించిన పోరు దారిలో చివరి మజిలీ వరకు కొనసాగాడని అన్నారు, పేద ప్రజల కోసమే పరితపించిన పేదల గుండె కామ్రేడ్ జనార్ధన్ అని అన్నారు.

విప్లవమే జీవితంగా ప్రజలే ఆస్తిగా భావించిన జనార్దన్ సార్ ప్రజల కోసమే నిరంతరం పాటుపడ్డారని తెలిపారు, అనేక ఆటుపోట్లను, బాధలను, శత్రువు దాడులను ఎదుర్కొని విప్లవం కోసం పరితపించాడని అన్నారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా విప్లవోద్యమాన్ని నిర్మించడంలో లో క్రియాశీలక పాత్ర పోషించాడని అందులో భాగంగానే 14 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపాడని తెలిపారు, కామ్రేడ్ జనార్దన్ సార్ లేనిలోటు పార్టీ శ్రేణులకు, ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమని అని అన్నారు. నాటినుండి అనేక మంది విప్లవకారులు కళ్లెదుటే నెలరాలుతున్నా గుండె దిటువుతో, దృఢ సంకల్పంతో విప్లవోద్యమాలను నిర్మిచాడాని అన్నారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా న్యూడెమోక్రసీ((CPI M-L New Democracy)) పార్టీ శ్రేణులను ముందుకు నడిపిన మహా నాయకుడు కామ్రేడ్ జనార్దన్ జెన్ను సార్ అని అన్నారు.

కామ్రేడ్ జెన్ను సార్ ఫ్యూడల్ భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా, దోపిడీ పిడనలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. సారా వ్యతిరేక పోరాటం, జీతగాళ్ల సమ్మె, కూలీ రేట్ల పెంపు, భూ పొరాటాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నడిపించాడని అన్నారు. జెన్ను భాయ్ నిరంతర పోరాట స్ఫూర్తి అని కొనియాడారు. నేడు దేశంలో మోడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్పొరేట్ కు కొమ్ముకాస్తు రాయితీలు ఇస్తూ, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. రైతు, కార్మిక, విద్యార్థి, నిరుద్యోగ సమస్యలను గాలికొదిలి, బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దేశభక్తి ముసుగులో మోడీ, ఆర్.ఎస్.ఎస్ ప్రభుత్వం ప్రశ్నించే సంస్థలపై, మేధావులపై దాడి మొదలుపెట్టిందని అన్నారు. మోడీ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను పొరాటాలవైపు నడుపుతూ బలమైన ప్రజా ప్రతిఘటన ఉద్యమాలను నిర్మించడమే కామ్రేడ్ జనార్థన్ జన్ను సార్ కు నిజమైన నివాళి అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బొమ్మిడి నగేష్, పి.వై.ఎల్ జిల్లా కార్యదర్శి బి.వి చారి, పి.డి.ఎస్. యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఏ.ఐ.కె.ఎం. ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బీరెడ్డి సత్తిరెడ్డి, అరుణోదయ జిల్లా నాయకులు ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఐ.ఎఫ్.టి.యూ పట్టణ నాయకులు రావుల వీరేశ్, జానపాటి శంకర్, దాసరి నర్సింహా, బొమ్మపాల అశోక్, మొండికత్తి సూరి,రావుల సైదులు, క్రాంతి, మల్లయ్య, అయోధ్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Strong resistance fights real tribute