Tailoring: టైలరింగ్ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
నల్లగొండ పట్టణంలో టైలరింగ్ కార్మికులకు కూలిరేట్లు పెంచాలని, ప్రభుత్వం 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అనేక పోరాటా లు నిర్వహించిన కార్మిక నాయకు డు శ్రీరామదాసు వెంకటేశ్వర్లు అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టైలరింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్త య్య అన్నారు.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలో టైలరింగ్(Tailoring workers) కార్మికులకు కూలిరేట్లు పెంచాలని, ప్రభుత్వం 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అనేక పోరాటా లు నిర్వహించిన కార్మిక నాయకు డు శ్రీరామదాసు వెంకటేశ్వర్లు అని సిఐటియు(CITU) జిల్లా సహాయ కార్యదర్శి టైలరింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్త య్య అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లో టైలరింగ్(Tailoring workers) వర్కర్స్ యూనియన్ మాజీ పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు వెంకటే శ్వర్లు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పిం చడం జరిగింది.
ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు నల్గొండ పట్టణంలో టైలరింగ్ కార్మికుల కూలి రేట్ల పెంపు కోసం ఇతర సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించినారని కొనియాడారు. రెడ్ మేడ్ దు స్తువులు మార్కెట్లోకి వచ్చిన తర్వాత టైలరింగ్(Tailoring workers) కార్మికులకు పనులు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీరామదాసు వెంకటేశ్వర్లు పోరాట స్ఫూర్తితో ప్రభుత్వ హాస్టల్, హాస్పిటల్స్ లకి అవసరమైన దుస్తుల తయారీ మధ్య దళారీలకు ఇవ్వకుండా నేరుగా టైలరింగ్ కార్మికులకు ఇవ్వాలని, ప్రభుత్వం 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లక్ష రూపాయలు ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలని, టైలర్ షాపులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం టైలరింగ్ కార్మికులు పోరాటాలు నిర్వహించాలని పిలు పునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ , పోలే సత్య నారాయణ, టైలరింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు రాపర్తి లక్ష్మీనారాయణ ,తాడూరు సంతోష్ కుమార్, మరియు వారి కుమారులు శ్రీరామదాసు వేణు, శ్రీరామదాసు గోపి యూనియన్ సభ్యులు శంకర్, మనోహర్, సాగర్, యాదగిరి, రాము, చారి, తదిత రులు పాల్గొన్నారు.
Tailoring workers demand houses