Tamil Nadu is struggling: తల్లడిల్లుతున్న తమిళనాడు
--భారీ వర్షాలు, వరదలతో పది మంది దుర్మరణం --తమిళనాడు దక్షిణాదిన జనజీవనం అస్తవ్యస్తo --రెండు రోజుల్లో 115 సెంటిమీటర్ల మేర వర్షపాతం --అతి భారీ వర్షాల అంచనా వేయడంలో ఐఎంఎ విఫలం
తల్లడిల్లుతున్న తమిళనాడు
–భారీ వర్షాలు, వరదలతో పది మంది దుర్మరణం
–తమిళనాడు దక్షిణాదిన జనజీవనం అస్తవ్యస్తo
–రెండు రోజుల్లో 115 సెంటిమీటర్ల మేర వర్షపాతం
–అతి భారీ వర్షాల అంచనా వేయడంలో ఐఎంఎ విఫలం
ప్రజా దీవెన/తమిళనాడు: వరుణదేవుడు పక్క రాష్ట్రం తమిళనా డు పై కన్నెర్ర చేస్తున్నాడు. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు అతలాకుతులమవుతుంది. రోజువారి జీవన స్థితిగతులు అస్తవ్యస్తమై అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు.
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదల వల్ల ఇప్పటికే 10 మంది దుర్మరణం పాలయ్యారు.
గడిచిన రెండు రోజులుగా తమిళనాడు దక్షిణాది ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా తయారై ప్రజలు పడరాని పాట్లుపడుతున్నారు. రాష్ట్రంలోని తిరునెల్వేలి, టు టికోరిన్ జిల్లాల్లో తాజా వర్షాల కారణంగా 10 మంది మరణించ గా అందులో గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో మరికొందరు మర ణించారని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
48 గంటల్లో 115 సెంటిమీటర్ల వర్షo….అతి భారీవర్షాలపై భారత వాతావరణశాఖ తప్పుడు అంచనాలు వేసిందన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.తమిళనాడులో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షా లు కురవవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారు. కాని టుటికోరి న్ జిల్లాలోని ఒక మున్సిపాలిటీలో రెండు రోజుల్లో 115 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని తమిళనాడు అధికారులులబోది బోమంటు న్నారు.
తిరునెల్వేలి, టుటికోరిన్ ప్రాంతాలలో రికార్డు స్థాయిలో వర్ష పాతం కురవడంతో వరదలు వెల్లువెత్తడంతో సదరు ప్రాంతాలు తడి సి ముద్దయ్యాయి. సుమారు 30 గంటల్లో కాయల్పట్టినంలో 1,186 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైందoటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అస్తవ్యస్తం..అతలాకుతలం…తిరుచెందూర్లో 921 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా టుటికోరిన్లో చాలా ప్రదేశాలు,తామిరభరణి నది ఒడ్డున ఉన్న గ్రామాలు వరదల కారణంగా పెద్ద ఎత్తున దెబ్బతి న్నాయని అధికారులు ప్రకటించారు.
నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో సహా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన 1,343 మంది సిబ్బంది రెస్క్యూ, రిలీఫ్ ఆపరే షన్లో పాల్గొన్నారని, ఇప్పటి వరకు 160 రిలీఫ్ క్యాంపులను ఏర్పా టు చేశామని తెలిపారు.
17 వేల మందిని ఈ పునరావాస క్యాంపు ల్లో ఉంచామని 34 వేల ఫుడ్ ప్యాకెట్లను ప్రజలకు సరఫరా చేశామ ని, ఇప్పుడు కూడా నీటి మట్టం తగ్గకపోవడంతో కొన్ని గ్రామాలకు చేరుకోలేకపోతున్నామని ఆ రాష్ట్ర ఉన్నతాధికారి చెప్పారు. తొమ్మిది హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నామని, హెలికాప్టర్ల ద్వారా 13,500 కిలోల ఆహారా న్ని వరద బాధితులకు సరఫరా చేశామని చెప్పారు.
తిరునెల్వేలిలో 64,900 లీటర్లు, టుటికోరిన్లో 30,000 లీటర్లు పాలను సరఫరా చేయగా కన్యాకుమారి, తెన్కాసి జిల్లాలలో విద్యు త్ సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో 323 పడవల్లో వదరల్లో చిక్కుకు పోయిన బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగామని, పొరుగు జిల్లాల నుంచి మరికొంత మంది సిబ్బందిని సహాయక చర్యలకు రప్పిస్తామని శివదాస్ చెప్పారు.
సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు టుటికోరిన్ పరిసర ప్రాంతాల్లో అదనంగా 200 వైర్లెస్ సెట్లను మోహరించాలని పోలీసులకు సూచించామని తమిళనాడు అధికార యంత్రాంగం ప్రకటించింది.