Revanth reddy: బిజెపితో తెలంగాణకు ప్రమాదం
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు.
ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు
రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేం దుకు బీఆర్ఎస్ కుట్ర
కేసీఆర్ మర్యాదగా మాట్లాడతా నంటే నేనూ మారి మాట్లాడుతా
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(RevanthReddy) వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ(BJP) వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీరావడం మంచిది కాదని, ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకూడదని ఆకాంక్షించారు. కేంద్రంలో బీజేపీకి మళ్లీ అధికారమిస్తే మధ్య యుగాల పాలనే సాగుతుందని, అప్పటి చక్రవర్తులు ‘రాజ్యమంటే నేను… నేనంటే రాజ్యమ’న్నట్లుగా ఉంటుందని ధ్వజమెత్తారు.
దేశం భిన్న ప్రాంతాలు, చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోతుందని హెచ్చరించారు. శుక్రవారం నిర్వ హించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆయన మాటల్లో నే.. బిఆర్ఎస్(BRS elections) ఎన్నికలను వది లేసిందని రేవంత్ వ్యాఖ్యానిం చారు. ఆ పార్టీ ఆరు సీట్లలో డిపా జిట్లు కోల్పోతోందని అభిప్రాయప డ్డారు.
తద్వారా, తెలిసో తెలియకో బీజేపీకి(BJP) లాభం చేస్తోందని వివరిం చారు. అధికారం పోవడం, కుమార్తె జైలుకు వెళ్లడంతో కేసీఆర్ తీవ్ర మా నసిక ఒత్తిడిలో ఉన్నారని, రోజుకో రకంగా రకరకాలుగా మాట్లాడుతు న్నారని తప్పుబడుతూనే ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. కేసీఆర్(KCR) పదేళ్ల తన పాలనలో వందేళ్లకు సం బంధించిన ఆర్థిక విధ్వంసం చేశార ని మండిపడ్డారు. కేసీఆర్ వాడే భాషనే తానూ వాడుతున్నానని, ఆటలో ఇద్దరికీ ఒకే నిబంధన లుండాలని, ఆయన కాలుతో ఆడితే నేను చేత్తో ఆడలేను కదా అని ప్రశ్నించారు. మర్యాదగా మా ట్లాడతానని ఆయన కాగితంపై సం తకం పెడితే తాను కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
Telangana danger in BJP ruling