
Telangana Digital Smart Ration Cards : ప్రజా దీవె న, హైదరాబాద్: ఇకపై రేషన్ కోసం ఆ పాత కాగితాల కార్డు పట్టుకుని లైన్లలో నిలబడే రోజులకు కాలం చెల్లిపోతోంది. తె లంగాణ ప్రభుత్వం పౌరసరఫ రా ల వ్యవస్థను ఏకంగా నె క్స్ట్ లె వె ల్కు తీసుకెళ్లేందుకు రూట్ మ్యా ప్ సిద్ధం చేసిం ది. మీ పర్స్ (Wal let) లో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎలా మె రుస్తాయో ఇకపై రేషన్ కా ర్డు కూడా అదే రేంజ్లో ‘స్మార్ట్’ గా మెరిసిపోనుంది. అవును, అర్హు లైన లబ్ధిదారులందరికీ AT M త రహా డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది.
కార్డు చిన్నదే.. కానీ ఫీచర్లు మాత్రం
ఈ సరికొత్త స్మార్ట్ కార్డు కేవలం చూడటానికి స్టైలిష్గా ఉండ టమే కాదు.. మోసాలకు అడ్డుకట్ట వేసేలా హైటెక్ సెక్యూరి టీతో రాబోతోంది. కార్డుపై లబ్ధిదారుడి పేరు, ఫుడ్ సెక్యూరిటీ నంబర్తో పాటు ఒక ప్రత్యేక QR కోడ్ ఉంటుంది. షాపుకు వెళ్లి స్కాన్ చేస్తే చాలు.. క్షణాల్లో పనిఅయిపోతుంది.ఈ స్మా ర్ట్ కార్డులపై ము ఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను కూడా డిజైన్ చేస్తున్నారు.
పారదర్శకతతో మరింత వేగం
బయోమెట్రిక్ సమస్యలు, సర్వ ర్ డౌన్ తలనొప్పులకు చెక్ పెడు తూ.. రేషన్ పంపిణీని అత్యంత సులభంగా, వేగంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ అసలు లక్ష్యమని అధికారులు పే ర్కొంటున్నారు. 2025 ఫిబ్రవరిలో ప్రభుత్వం చేపట్టిన కొ త్త దరఖాస్తులు, మార్పు లు-చే ర్పుల డ్రైవ్ తర్వాత రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ పెరిగిన జనాభాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సూపర్ ఫాస్ట్గా సేవలు అందిం చడాని కే ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రస్తుతం అధికారులు రేషన్ షా పుల వారీగా లబ్ధిదారుల లిస్ట్ను రెడీ చేస్తూ, కార్డుల పంపి ణీకి ఏర్పాట్లు ము మ్మరం చేశారు. సో.. రేషన్ బజార్లో ఇక “స్మార్ట్” కార్డ్ స్వైప్ చేసే రోజులు వచ్చేస్తున్నాయ న్నమా ట గా విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది.




