OpinionPoliticsక్రైంజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Telangana RTC strike tragedy : బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీలో సమ్మెలో విషాదం, పోరాటయోధుడు శంకర్ గౌడ్ కన్నుమూత

బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీలో సమ్మెలో వి షాదం, పోరాట యోధుడు శంకర్ గౌడ్ కన్నుమూత

Telangana RTC strike tragedy :  ప్రజా దీవెన, నర్సం పేట: ఆర్టీసీ కా ర్మికుల గుండెల్లో గుబులురేపే వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం విషాదాంతమైంది. మృ త్యువుతో పోరాడిన ఆయన, చివరకు తుదిశ్వాస విడిచా రు. ఈ ఘటన ఆ ర్టీసీ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిం ది.

సమ్మెలో భాగంగా ఆత్మహత్యా యత్నం చేసిన శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో నర్సంపే టలో చికిత్స పొం దుతూ పరిస్థితి అత్యంత విషమంగా మారిన నేపద్యంలో హైదరాబాద్‌కి తరలించా రు. ప్రాణాపాయం నుండి కాపా డేందుకు వైద్యులు ‘గ్రీన్ ఛానెల్’ ద్వారా ఆయనను అత్యవ సరంగా హైదరాబాద్‌కు తరలించారు.

  విషాదoగా శంకర్ గౌడ్ కథ ముగింపు

హైదరాబాద్‌ చేరుకున్నాక వైద్యు లు సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన ప్రాణా లు విడిచినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి మరణం కా దు, ఆర్టీసీ కార్మికుల ఆవేదన కు ప్ర తిరూపం అని తోటిఉద్యోగులు క న్నీరుమున్నీరవు తున్నారు.” ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం. కార్మికుల మనోధైర్యం ఏ స్థాయిలో దె బ్బతిన్నదో తెలియజేస్తోంది.

శంకర్ గౌడ్ మరణ వార్త తెలిసిన వెంటనే అని కార్మిక సం ఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. శంకర్ గౌ డ్ మరణంతో నర్సంపేట డిపోలో, రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మి కుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, దిగ్భ్రాంతి నెలకొన్నాయి.

   సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కు టుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ స భ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికా వేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరం లో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికు లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్య ల ను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుంద ని గుర్తు చేశారు.

 

శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. ఐదుకోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

— బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధి కార ప్రతినిధి పాల కూరి రవిగౌడ్

నల్లగొండ: ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల ను వెంటనే అమలు చేయాలని ఓబీసీ మోర్చా రా ష్ట్ర అధికార ప్రతి నిధి పాలకూరి రవిగౌడ్ ఘాటుగా స్పందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కా ర్మి కుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయా లని ఈ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపా రు. ఆర్టీసీ కార్మి కులను ప్రభుత్వం లో విలీనం చేసే ప్రక్రియను తక్షణ మే పూ ర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న రెండు PRC బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాబోయే PRCలో టీఎస్ ఆర్టీసీ కార్మికులను చేర్చాలని, ప్ర భుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిం చాలని,ఆర్టీసీ బస్సులను ఆధునికీకరించి విస్తరించాల న్నా రు.ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలతో కొత్త స ర్వీసు లు ప్రారంభించాలని, ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణకు అ నుమతి ఇవ్వాలని, శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణమే రూ. 5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related Articles

Back to top button