Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tinmar Mallanna: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిపించాలి.

నల్గొండ ఖమ్మం వరంగల్ పుట్టభద్రులఎమ్మెల్సీ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కమిటీ నెంబర్ కుంభం శ్రీను, విద్యావంతులకు పిలుపునిచ్చారు.

ప్రజా దీవెన, కోదాడ: నల్గొండ ఖమ్మం వరంగల్ పుట్టభద్రులఎమ్మెల్సీ ఉపఎన్నికలలో కాంగ్రెస్(Congress)  పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna) అఖండ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కమిటీ నెంబర్ కుంభం శ్రీను, విద్యావంతులకు పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో తీన్మార్ మల్లన్న గెలుపుకై ప్రచారాన్ని నిర్వహించారు.

అనంతరం శ్రీను మాట్లాడుతూ, కోదాడ(Kodada) నియోజకవర్గ పరిధిలో ఉన్న పట్టభద్రులంతా తీన్మార్ మల్లన్నకు తమ ఓటును(Vote) వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు అలాగే మార్నింగ్ వాకింగ్ లో పట్టభద్రులను తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిందిగా కోరారు ఈ ప్రచారంలో పంది కళ్యాణ్ బాబు పాముల భాస్కర్ శ్రీనివాస్ గట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..

Tinmar Mallanna win MLC elections