Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vande Mataram trains on new routes…! సరికొత్త మార్గాల్లో వందేమాతరం రైళ్ళు…!

- గణనీయమైన ప్రయాణీకుల డిమాండ్ పై దృష్టి -- పూణే, హైదరాబాద్, భోపాల్‌లకు రూట్ కు అవకాశం

సరికొత్త మార్గాల్లో వందేమాతరం రైళ్ళు…!

 

— గణనీయమైన ప్రయాణీకుల డిమాండ్ పై దృష్టి
— పూణే, హైదరాబాద్, భోపాల్‌లకు రూట్ కు అవకాశo

 

ప్రజా దీవెన/సికింద్రాబాద్: దేశంలో గణనీయమైన ప్రయాణీకుల డిమాండ్ దృష్ట్యా నాగ్‌పూర్ ద్వారా పూణే –హైదరాబాద్ –భోపాల్‌లకు వందే భారత్ రైళ్లు ( vandhematharam  trins) త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమృత్ భారత్ యోజన కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈరోజు డివిజనల్ రైల్వే మేనేజర్ తుషార్ కాంత్ పాండే (thushar khanth pande) విషయం వెల్లడించారు.

నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్, దేశం యొక్కగుండె (The heart of the nation) గా పిలువబడడంతో పాటు ఇది నాలుగు దిశలలోని వివిధ ప్రావిన్సులను కలుపుతుంది.

ముంబై, పూణే, హైదరాబాద్, భోపాల్ వంటి ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లు తరచుగా ప్రయాణికులతో రద్దీ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. నాగ్‌పూర్ నుండి ముంబైకి అధిక సంఖ్యలో రైళ్లు ఉండగా, పూణే, హైదరాబాద్, భోపాల్‌లకు రైళ్ల ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ( The frequency of trains is very less) గా ఉండడంతో రద్దీ పెరిగింది.

ఈ క్రమoలో అనేక ప్రైవేట్ బస్సులు నాగ్‌పూర్ తదితర నగరాల మధ్య నడుస్తాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కోరుతూ రైల్వే అధికారులు (railway officers) మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించారు.

వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రధానంగా మహారాష్ట్రతో సహా సెంట్రల్ రైల్వే సెక్షన్‌లో ప్రయాణికుల నుండి అద్భుతమైన స్పందన కనబడుతోంది. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖ బహుళ మార్గాల్లో వందే భారత్ రైళ్ల(Vande Bharat trains on multiple routes) ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఫలితంగా నాగ్‌పూర్‌ నుంచి పూణె, హైదరాబాద్‌, భోపాల్‌లకు వందే భారత్‌ రైళ్లను త్వరలో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.