‘Vandebharat’ from Hyderabad to Bangalore: హైదరాబాద్ నుంచి బెంగళూర్ కు ‘ వందేభారత్ ‘
-- తెలంగాణ నుండి బయలుదేరే మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ -- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
హైదరాబాద్ నుంచి బెంగళూర్ కు ‘ వందేభారత్ ‘
— తెలంగాణ నుండి బయలుదేరే మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్
— వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: హైదరాబాద్ (కాచిగూడ) మరియు బెంగళూరు (యశ్వంతపూర్) మధ్య రెగ్యులర్ వందే భారత్ రైలు సర్వీసు ప్రారంభం కానుంది. తెలంగాణ నుంచి బయలుదేరే మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ( The third Vande Bharat Express departing from Telangana) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలను కలుపుతూ ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి (Depart from Kachiguda Railway Station, Hyderabad) మహబూబ్నగర్, కర్నూలు టౌన్, అనంతపురం, ధర్మవరంలో ఆగిన తర్వాత బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.
సౌత్ సెంట్రల్ రైలు (SCR) నుండి వెలువడిన లేఖ సారాంశం ప్రకారం 610-కిలోమీటర్ల ప్రయాణానికి 8.30 గంటలు లేదంటే ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు కంటే దాదాపు 2.50 గంటలు తక్కువ సమయం (About 2.50 hours less than the fastest train) పడుతుంది.
రెగ్యులర్ సర్వీస్ సెప్టెంబర్ 25న యశ్వంత్పూర్ నుండి మరియు సెప్టెంబర్ 26న కాచిగూడ నుండి ప్రారంభమవుతుంది (Starting from Kachiguda on 26th September) . ఈ రైలులో ఎనిమిది కోచ్లు ఉoటుoడగా వీటిలో ఏడు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్లు మరియు వాటిలో ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉంటుంది.
ఈ రెగ్యులర్ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, బుధవారాల్లో ఎటువంటి సేవ ఉండదు. 530 మంది వ్యక్తుల వరకు ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలు, ఛార్జీల సమాచారం కోసం ప్రయాణీకులు irctc వెబ్సైట్ని సందర్శించవచ్చు ( Passengers can visit irctc website for fare information) లేదా రిజర్వేషన్ కౌంటర్లలో విచారణ చేయవచ్చు.
ఇక చార్జీల వరకు వచ్చేసరికి క్యాటరింగ్ ఛార్జీతో సహా AC చైర్ కార్ ఛార్జీ రూ. 1,540, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2,865, క్యాటరింగ్ లేకుండా ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ. 1,255, క్యాటరింగ్ లేకుండా ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ. 2,515 మేరకు ఛార్జీలు వసూలు చేయనున్నారు.