Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR Election campaign: అభ్యర్థుల గుణగనాలను చూసి ఓటేయండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్య ర్థుల గుణగనాలను చూసి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటయ్యాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ ) పిలుపునిచ్చారు.

నల్లగొండ లో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజా దీవెన, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Election)అభ్య ర్థుల గుణగనాలను చూసి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటయ్యాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ )(ktr) పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని మోసకారి ప్రభుత్వ విధానాలను ఎండగట్టి కడిగిపారేసే బి ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ((MLC Election campaign) )విచ్చేసిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సన్న దాన్యంకి మాత్రమే బోనస్ ఇస్తాం అని కాంగ్రెస్ మోసం చేసిందని గుర్తు చేశారు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 420 హామీలను ఇచ్చి యావత్ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ తప్పిదా లను పొరపాట్లను ప్రపంచానికి ఎత్తి చూపే ప్రతిపక్షoలో ఉన్న బి ఆర్ ఎస్ కి అవకాశం ఇవ్వాలని కోరారు. అడుగడుగునా ప్రభుత్వం ని ప్రశ్నిస్తామని, ప్రజలు పట్టభద్రుల తరఫున నిరంతరం పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు.పదేళ్లు నిజాయితీగా పని చేశామని వివరించారు. మోసాలు, బ్లాక్ మెయిల్ దందా చేసే కాంగ్రెస్ వాళ్ళను తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. రేవంత్ వచ్చినంక ఒక్క నియామకం చేపట్టలేదని, పదేళ్లలో మేము ఇచ్చిన ఉద్యోగ నియామకా లతో పాటు ప్రభుత్వం చివర్లో ఇచ్చిన ఉద్యోగాలకు మాత్రమే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే పంపిణీ చేసిందని విమర్శించారు.

అపాయింట్మెంట్ లేటర్ లు పంపిణీ చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని గుర్తు చేశారు. కేవలం నిరుద్యోగులే కాకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసారని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు విని వారి చేతుల్లో సబ్బండ వర్గాలు మోసపోయాయని ప్రచారం వ్యక్తం చేశారు. మంచిగా ఉన్న బి ఆర్ ఎస్ పాలనను దూరం చేసుకున్నామని ప్రజలు బాధపడు తున్నరని గుర్తు చేశారు. గ్రాడ్యు యేట్ లు అన్ని ఆలోచన చేసి ఓటయ్యాలని, సమాజానికి చీడ పురుగు లాంటి బ్లాక్ మెయిల్ వ్యక్తి లకు బుద్ధి చెప్పాలని పిలుపుని చ్చారు. రాష్ట్రంలోని సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్(congress) ప్రభుత్వం పక్క సన్నాసి ప్రభుత్వమని అభివ ర్ణించారు. సన్నలకు మాత్రమే బోనస్ ఇస్తామoటున్న కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టాలని కోరారు. అటబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైoదని దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి,
శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,
ఎమ్మల్సి అభ్యర్థి రాకేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Vote to good candidate in MLC elections