Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadeesh reddy: ‘టెయిల్ పాండ్ నుంచి నీరు పోతుంటే ఇద్దరు మంత్రులకు సోయి లేదు’

నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యు డు జగదీష్ రెడ్డి తో పాటు పలు వురు మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్య క్రమానికి హాజరయ్యారు.

భారీ రోడ్ షోతో భారాసా నామినేషన్
నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్
హాజరైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యు డు జగదీష్ రెడ్డి తో పాటు పలు వురు మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్య క్రమానికి హాజరయ్యారు. ఈ సంధర్బంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బి ఆర్ ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు తధ్యమని తెలుస్తోందని ధీమా వ్యక్తంచేశారు. వంద రోజుల్లో నే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్య తిరేకత ఆరంభమైoదని చెప్పారు.

డిసెంబర్ 9 తేదిన 6 గ్యారంటీల అమలు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు.ఎన్నికల కు ముందు రైతు బంధు ఆపిన ఘనులు వీళ్ళేనని, రుణమాఫీ ఏమైందీ, హామీల అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. రైతులు ఎండిన పంటల గురించి, రైతు బంధు గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టండి అన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిత్రలో నిలిచిపో తారని ఎద్దేవా చేశారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు వచ్చిం దని నిరూపిస్తే మా ఎంపీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తామని,  లేదంటే మీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నిం చారు. గత 100 రోజుల్లోనే 200 రైతుల ఆత్మహత్యలు జరిగినందు కు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండి 2 లక్షల ఎకరాలు ఎండినందుక ఓటు వేయాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

నాగార్జునసాగర్ లో 508 లెవల్ ఉన్న ఎడమ కాలువ పరిధిలో సాగు నీరు ఇచ్చామని, మీరు మాత్రం రైతులకు ఇస్తామన్న బోనస్ వ్యాపారులకు ఇస్తున్నారని విమర్శించారు. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేయటంతోనే తక్కువ ధరకు ధాన్యం అమ్మల్సిన దుస్థితి ఏర్పడిందని, కెసీఆర్ తెచ్చిన పథకాలను నిర్వీర్యం చేశారని ద్వజమెత్తారు. గత ఐదేళ్ల లో ఎన్ని వ్యవసాయ పంపు సీట్లు కాలిపోయాయో, నాలుగు నెలల్లో ఎన్ని మోటార్లు కాలిపోయాయో లెక్క తీద్దామా అని ప్రశ్నించారు.

కెసిఆర్ ఏ మొహం పెట్టుకొని నల్ల గొండ జిల్లాకు వస్తాడని మంత్రి కోమటిరెడ్డి అనడం సిగ్గు చేటని, ఫ్లోరైడ్ పీడిత జిల్లాను ధాన్యాగారం గా మార్చిన ఘనత కేసిఆర్ దేనని కొనియాడారు. ప్రజలకు మొహం చూపే ధైర్యం మీకే లేదని, నాగార్జు నసాగర్ డ్యాం మీదకు వెళ్లే ధైర్యం ఉందా, టెయిల్ పాండ్ నుంచి నీరు పోతుంటే ఇద్దరు మంత్రులకు సోయి లేదని దుయ్యబట్టారు. దీనిపై మాట దాటవేసిన ఇరిగేషన్ మంత్రికి, సెక్రటరీ కేంద్రానికి లేఖరా సింది నిజం కాదా అని ప్రశ్నించా రు. కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిం దని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లo మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Water is leaking from Nagarjuna sagar tail pond