Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana activists: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా పోరాడిన ఉద్యమకారులకు సన్మానం..

తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాటి దెబ్బలకు వెనుతిరకక ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు కుర్ర రామారావు పగడాల రామచంద్రారెడ్డి రాయపూడి వెంకటనారాయణ లకు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు, ఒంటి పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాల సాలువులతో ఘనంగా సన్మానించారు.

ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా(Telangana movement) మలిదశ ఉద్యమంలో లాటి దెబ్బలకు వెనుతిరకక ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు కుర్ర రామారావు పగడాల రామచంద్రారెడ్డి రాయపూడి వెంకటనారాయణ లకు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ (Congress party leaders)నాయకులు చందు నాగేశ్వరరావు, ఒంటి పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాల సాలువులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో చావుని లెక్కచేయకుండా పోరాడి ఎలాంటి పదవుల ఆశించకుండా తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేసిన మహా నాయకులను సత్కరించటం ఆనందంగా ఉందని. ఇలాంటి ఉద్యమకారులను సత్కరించు కోవటం మన అదృష్టమని తెలిపారు. ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులకు జోహార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంటి పులి శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, లైటింగ్ ప్రసాద్, ఎస్కే గౌస్, జగ్గు, గునుగుంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

wishes to Telangana activists