Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన, ఇండియా నుంచి కాంగ్రెస్ ను గెంటే యాలి

ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీని కూటమి నుంచి వెంటనే తొలగిం చాలని ‘ఇండియా’ పార్టీల ను కోరతామని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన మహిళా సమ్మాన్ యోజన, సంజీ వని యోజన పథకాలపై ఇరు పార్టీ మధ్య మాటల యుద్ధం ఈ కూట మిలో పెనుదుమారం రేపుతున్నది.

ఈ రెండు పథకాలపై ఢిల్లీ యూత్ కాంగ్రెస్ కేజ్రివాల్ పై పోలీసులకు ఫిర్యా పార్టీపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ కేజీవాల్ ను ‘దేశ వ్యతిరేకి’ అని అజయ్ మాకెన్ అనడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో మాకెన్ పై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడా నికి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు ఇస్తుందని ఆరోపించారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చును బీజేపీ భరిస్తోంది ..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు ను బీజేపీ భరిస్తోం దని ఢిల్లీ సీఎం అతిషీ ఆరోపిం చారు. ఆమ్ ఆద్మీ ని దేశ వ్యతిరేక పార్టీగా భావిస్తే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎందుకు కలిసి పోటీ చేశారని ఆమె ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకు లు లోపాయికారి ఒప్పందం చేసు కుని డిల్లీలో ఆప్ను ఓడించాలని చూస్తున్నారని మండిపడ్డారు.