Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Agrigold: అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ కొడుకు అరెస్ట్

–అగ్రిగోల్డ్ భూముల కేసులో ఎ 1 నిందితుడు గా జోగి రాజీవ్
— నేటి ఉద‌యం నుంచి జోగి నివా సంలో కొనసాగుతున్న ఏసీబీ సోదా లు, ప‌లు డాక్యుమెంట్లు స్వాధీనం
–ఇది క‌క్ష సాధింపు చ‌ర్యేన‌న్న జోగి ర‌మేష్

Agrigold: ప్రజా దీవెన, ఇబ్రహీంపట్నం: అగ్రి గోల్డ్ (Agrigold)కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని (Ibrahimpatnam Ferry Road)జోగి నివా సానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే ఏసీబీ అధికా రులు చేరుకున్నారు. ఐదు గంటల కు ‌నివాసం లోనికి వెళ్లిన 15 మంది ఏసీబీ అధికారులు నాలుగున్నర గంటల పాటు విస్తృత సోదాలు చేశారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అనంతరం జోగి తన యుడు రాజీవ్ ను అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి (ACB office)తరలించారు. అంబాపురంలోని అగ్రి గోల్డ్ భూ వ్యవహారంలో రాజీవ్ తో పాటు మరో ఎనిమిది మందిపై సీఐడీ కేసు నమోదు (CID case registration) చేసింది. సీఐడీ జప్తులో ఉన్న అగ్రి గోల్డ్ భూములను కొను గోలు చేసి విక్రయించినట్లు సీఐడీ గుర్తించింది. భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ ఏ – 1గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వర రావు ఏ – 2గా చేర్చారు. 420, 409, 467, 471, 120 (బీ), 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.రాజీవ్ ను అరెస్టు చేసి కారులో ఎక్కిస్తున్న క్రమంలో జోగి అనుచరులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. అరెస్ట యిన జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్షపూరి తంగా వ్యవహరిస్తుందన్నారు.

తప్పు చేశామని నిరూపిస్తే ఉరేసుకుంటాం : జోగి రమేష్
అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల వ్యవహారంలో తాము తప్పు చేశా మని నిరూపిస్తే ఉరేసుకుంటామని మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh)అన్నారు. తనయుడు రాజీవ్ ను ఏసీబీ అధి కారులు అరెస్టు చేసి తరలిస్తున్న క్రమంలో ఆయన నివాసం ఎదుట రోడ్డుపై మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అభంశుభం తెలి యని తన కుమారుడిని అన్యా యంగా అరెస్టు చేయడం తగద న్నారు. చంద్రబాబు ప్రభుత్వం బల హీన వర్గాలను వేధిస్తుందన్నారు.

విజయవాడ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు (ACB inspections) నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం 15 బృందాలు ఇబ్రహీం పట్నం లో ఉన్న నివాసంలో అతని కార్యా లయం లో దాడిచేశాయి. ఏసీబీ ఆగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో సోదాలు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.