–15 శాతం అంతర్జాతీయ విమానా ల్లో కోత విధింపు
–ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టితో రేపటి నుంచి అమలు,
Air India Flight Reduction : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: అంతర్జా తీయ విమాన సర్వీసులను త్కాలికంగా 15 శాతం మేర తగ్గి స్తున్నట్లు ఎయిరిండియా ప్రకటిం చింది. ఆపరేషనల్ స్టెబిలిటీ, ప్రయా ణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రేపటి నుంచి ఈ విధానం అమల్లోకి రా నుంది. జూలైలో కనీసం 15 రోజుల వరకు విమాన సర్వీసుల సంఖ్యల కోత ఉంటుందని ఎయిరిండియా అధికారు లు వెల్లడించారు. ఈ నెల 12న అహ్మదాబాద్ విమాన ప్రమా ద ఘటన తర్వాత ప్రయాణికుల భ ద్రతపై అధికారులు మరింత దృష్టి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా బో యింగ్ విమానాల్లో భద్రత ప్రమా ణాలను పెంచాలని నిర్ణయించడం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల తో మధ్య ఆసియాలో నెలకొన్న పరి స్థితులు కూడా ఎయిరిండియా ఈ నిర్ణయానికి వచ్చింది.
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య …ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీం తో జమ్మూ కాశ్మీర్ కు వెళ్ళాల్సిన ఇండిగో సర్వీస్ 6ఈ 2006 ను ఢిల్లీ నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే వెనక్కి పంపించారు. 180 మంది ప్ర యాణికులతో బయలుదేరిన వి మానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాం డ్ అయినట్లు అధికారులు వెల్లడిం చారు. అదృష్టవశాత్తు ప్రయాణికు లంతా సురక్షితంగానే ఉన్నట్లు తెలి పారు. లేహ్ లాలో ల్యాండింగ్ సమ స్య కారణంగానే విమానాన్ని తిరిగి వెనక్కి పంపించినట్లు చెప్పారు. నిన్న కూడా భువనేశ్వర్ నుంచి కో ల్ కత్తా వెళ్లాల్సిన ఇండిగో విమా నం 6ఈ 6101 లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే అప్ర మత్తమైన సిబ్బంది ఏటీసీకి సమా చారం ఇవ్వడంతో విమానాన్ని తిరి గి వెనక్కి పంపించారు. మరోస ఘటనలో నిన్న ఢిల్లీ-రాయ్పూర్ ఇండిగో విమానం ల్యాండింగ్ త ర్వాత డోర్ తెరుచుకోక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయా ణికులు 40 నిమిషాల పాటు విమా నంలోనే చిక్కుకుపోయారు.