–ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1లో ఘటన
Airport Roof: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీలోని (delhi) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) టెర్మినల్-1లో పైకప్పు కూలిపోయింది. విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిన సమాచారం తెల్లవారుజామున 5.30 గంటలకు అందిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఘటనాస్థలికి మూడు అగ్నిమాపక వాహనాలను పంపించామని తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు అగ్నిమాపక శాఖ (Fire Dept)తెలిపింది.
పైకప్పు కూలడంతో కొన్ని కార్లు (cars)కూడా దెబ్బతిన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎయిర్ పోర్టులో పైకప్పు కూలడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి (hospital) తరలించారు. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఒక వ్యక్తి అందులో చిక్కుకున్నాడు. క్షతగాత్రులు ప్రయాణికులా లేక ఎయిర్పోర్టు ఉద్యోగులా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.ఈరోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో జలదిగ్బంధం నెలకొంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్గా (traffic jam) మారింది.