–హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై అఖిలేశ్ దిగ్భాంత్రి
Akhilesh: ప్రజాదీవెన, హథ్రాస్: హాథ్రస్ ఘట నపై (Hathras incident) సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధా కరమైన సంఘటన. దీనికి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వమే (Uttar Pradesh Govt)పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సరైన చిక్సిత అందక కొందరు మరణించారు. ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి ఏమి కాదు. మళ్లీ పునరావృతం కాకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని అఖిలేశ్ యా దవ్ అన్నారు. హాథ్రస్లో పర్యటిం చిన ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తొలుత పోలీ సు అధి కారులతో సమావేశమై పరిస్థితి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. ఘటన జరిగిన వివరాలను పోలీసులు (polices)వారికి వివరించారు. అనంతరం హాథ్రస్ ఘటనలో (Hathras incident) గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లిన సీఎం యోగి, చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదే శించారు. బాధితుల కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు.