Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti Srinivas Reddy: పదేళ్లలో వారు చేయలేనిది మేము పది నెలల్లో చేశాం

–రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించాం
–ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నర లో అనేక పథకాలు ప్రవేశపెట్టింది
— రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్ రెడ్డి

Minister Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన,ఖమ్మం:ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లోనే రైతు లకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అయిందని మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి స్పష్టం చేశారు. అదే బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి కేవలం రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిందని విమర్శించా రు. శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వా రావుపేట నియోజకవర్గ పరిధిలో ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యే ఆ ది నారాయణలతో కలసి మంత్రి పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ ప్రజల దీవెనలతో అధికారం లోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నర కాలం పూర్తిచేసుకుంద ని ఈ సమయంలో అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడించారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షే మానికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని ఆదిశగా కాంగ్రెస్ సర్కా రు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తు చేశారు. ఆనాడు పా లించిన ప్రభుత్వం చేసిన మంచి కా ర్యక్రమాలు అమలు చేస్తూనే అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8 లక్షల 19 వేల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ పేదవాని కళ్లల్లో ఆనందాన్ని చూడాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుందన్నారు.పేదలు కలలు కన్న డబుల్ బెడ్ రూం ఇంటి కలను ఆనాటి ప్రభుత్వం పదేళ్లు కలగానే మార్చిందని, ఆ కలను ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే సాకారం చేస్తుం దని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరో సా పేరిట రైతులకు ఎకరాకు రూ. 12 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. తొ మ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తా మని పొంగులేటి వెల్లడించారు.