Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anil Kumar Yadav : అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, అనిల్ కుమార్ యాదవ్.

Anil Kumar Yadav : ప్రజా దీవెన, తిరుమలగిరి: తిరుమలగిరి మండల పరిధిలో పలు గ్రామాలలో రేషన్ కార్డుల జాబితా వెలువడిన సందర్భంగా అర్హులైనటువంటి అనేక మందికి జారీ అయిన జాబితాలో పేరు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొండే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు..
ఎన్నికల హామీలు అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ నేటికీ ఒక్క రేషన్ కార్డు కూడా చేసిన దాఖలాలు లేవని..ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుతుందని విమర్శించారు.గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో అనేకమందికి సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

 

గత కొన్ని సంవత్సరాలు నుండి పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కలిగినటువంటి అనేక మందికి ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా నోచుకోలేదని మరి ఇప్పుడైనా రేషన్ కార్డులు వస్తాయని ఆశించినటువంటి వాళ్ళు నిరాశ నిరాశకు గురవుతున్నారని అన్నారు.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి యొక్క జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ రేషన్ కార్డులు జారీ చేయకుండా ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేస్తుందని మండిపడ్డారు..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయా రాష్ట్రాలకు తెలియజేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం పెడుతుందని ప్రభుత్వాన్ని విమర్శించారు