Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Accident: ప్రమాదం జరిగిన చోటే మరో ఘోర ప్రమాదం

–ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు గాయపడిన ఘటన

Accident: ప్రజా దీవెన, చిత్తూరు: వరుస రోడ్డు ప్రమాదాలతో ఆంద్రప్రదేశ్ రక్తమోడుతోంది. మొగిలి ఘాట్ లో లారీలు, బస్సు ఢీకొని ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన మరువక ముందే బంగారు పాళ్యం సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయ పడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతి (Bangalore to Tirupati)కి దైవ దర్శనానికి బెంగళూరు దొడ్డబల్లాపుర నుండి ఒక ఫ్యామిలీ శనివారం వేకువ ఝామున బయలుదేరింది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో బంగారుపాళ్యం చేరుకుంది. వారు ప్రయాణం చేస్తున్న ఇన్నోవా కారు (Innova car) టైరు పేలడంతో బంగారుపాళ్యం ప్లై ఓవర్ బ్రిడ్జిపైన ప్రమాదం జరిగింది. కారు అదు తప్పి బోల్తాపడి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జు అయ్యింది.

కారులోని బెంగళూరుకి చెందిన గంగయ్య 56, లక్ష్మీ 35 అక్కడి కక్కడే మృతి చెందారు. శ్రీనివాస మూర్తి 51, సుచిత్ర 48, ఉష 32, ధరణి 22 గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలియగానే బంగారు పాళ్యం ఎమ్మార్వో బాబు రాజేంద్రప్రసాద్, బంగారుపాళ్యం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాంభూపాల్ అక్కడికి చేరుకున్నారు. మృతదే హాలను బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి బంగారుపాళ్యం ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే వారు కోలారు ఆసుపత్రికి వెళ్తామని అన్నారు. దీంతో పోలీసులు వారిని అంబులెన్స్ లో కోలారు (Kolar)కు పంపారు.